Pakistan: ఇంతకన్నా దరిద్రం ఉంటుందా.. ‘‘గాజా పీస్ బోర్డు’’లో పాక్ చేరికపై సెటైర్లు..
- గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరిన పాకిస్తాన్..
- బోర్డు సభ్యుడిగా ఉండేందుకు 1 బిలియన్ డాలర్లు ఖర్చు..
- మరోవైపు యూఏఈ, ఐఎంఎఫ్ నుంచి అప్పు కోసం ప్రయత్నం..
- ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందా అని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ అంతర్జాతీయంగా తాను పెద్ద దేశాన్ని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టించుకోవడం లేదు. తాజాగా, ట్రంప్ ప్రతిపాదితన గాజాకు సంబంధించిన ‘‘బోర్డ్ ఆఫ్ పీస్‘‘లో చేరిన 8 ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, పునర్నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఈ బోర్డును ఏర్పాటు చేశాడు. దీంట్లో చేరుతున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
Read Also: Air India Loss: టాటా గ్రూప్కు ఎయిర్ ఇండియా షాక్.. ఏకంగా రూ.15 వేల కోట్ల భారీ నష్టం! రీజన్ ఇదే..
Also Read
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ఇక్కడ పాకిస్తాన్ దరిద్రం ఏంటంటే, ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో శాశ్వత సభ్యుడిగా చేరడానికి దాదాపు 1 బిలియన్ డాలర్లను(దాదాపు ₹8,300 కోట్లు) చెల్లిస్తోంది. ఈ డబ్బుల్ని చెల్లించేందుకు కూడా పాక్ సిద్ధమైంది. ఇదే సమయంలో యూఏఈ నుంచి 2.2 బిలియన్ డాలర్ల అప్పును కోరుతోంది. మరోవైపు, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల రుణ పథకం కొనసాగింపు కోసం ప్రయత్నిస్తోంది.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అయినా కూడా అంతర్జాతీయ వేదికలపై గప్పాలు కొడుతోంది. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి, ఆ దేశంలో ద్రవ్యోల్భణం, నిరుద్యోగాలు పీక్స్కు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాజా శాంతి బోర్డులో గొప్పల కోసం చేరడం అవసరమా అని పాక్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ బోర్డులో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, ఖతర్, యూఏఈ, పాకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రతీ శాశ్వత సభ్య దేశం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిర్ణయాన్ని పాక్ సమర్థించుకుంటుంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ఇచ్చే కీలక వేదిక అని, శాశ్వత కాల్పుల విరమణ దిశగా ఇది సహాయపడుతుందని అన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!