Pakistan: ఇంతకన్నా దరిద్రం ఉంటుందా.. ‘‘గాజా పీస్ బోర్డు’’లో పాక్ చేరికపై సెటైర్లు..
- గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరిన పాకిస్తాన్..
- బోర్డు సభ్యుడిగా ఉండేందుకు 1 బిలియన్ డాలర్లు ఖర్చు..
- మరోవైపు యూఏఈ, ఐఎంఎఫ్ నుంచి అప్పు కోసం ప్రయత్నం..
- ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందా అని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ అంతర్జాతీయంగా తాను పెద్ద దేశాన్ని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టించుకోవడం లేదు. తాజాగా, ట్రంప్ ప్రతిపాదితన గాజాకు సంబంధించిన ‘‘బోర్డ్ ఆఫ్ పీస్‘‘లో చేరిన 8 ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, పునర్నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఈ బోర్డును ఏర్పాటు చేశాడు. దీంట్లో చేరుతున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
Read Also: Air India Loss: టాటా గ్రూప్కు ఎయిర్ ఇండియా షాక్.. ఏకంగా రూ.15 వేల కోట్ల భారీ నష్టం! రీజన్ ఇదే..
Also Read
ఇక్కడ పాకిస్తాన్ దరిద్రం ఏంటంటే, ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో శాశ్వత సభ్యుడిగా చేరడానికి దాదాపు 1 బిలియన్ డాలర్లను(దాదాపు ₹8,300 కోట్లు) చెల్లిస్తోంది. ఈ డబ్బుల్ని చెల్లించేందుకు కూడా పాక్ సిద్ధమైంది. ఇదే సమయంలో యూఏఈ నుంచి 2.2 బిలియన్ డాలర్ల అప్పును కోరుతోంది. మరోవైపు, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల రుణ పథకం కొనసాగింపు కోసం ప్రయత్నిస్తోంది.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అయినా కూడా అంతర్జాతీయ వేదికలపై గప్పాలు కొడుతోంది. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి, ఆ దేశంలో ద్రవ్యోల్భణం, నిరుద్యోగాలు పీక్స్కు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాజా శాంతి బోర్డులో గొప్పల కోసం చేరడం అవసరమా అని పాక్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ బోర్డులో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, ఖతర్, యూఏఈ, పాకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రతీ శాశ్వత సభ్య దేశం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిర్ణయాన్ని పాక్ సమర్థించుకుంటుంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ఇచ్చే కీలక వేదిక అని, శాశ్వత కాల్పుల విరమణ దిశగా ఇది సహాయపడుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!