Pakistan: ఇంతకన్నా దరిద్రం ఉంటుందా.. ‘‘గాజా పీస్ బోర్డు’’లో పాక్ చేరికపై సెటైర్లు..
- గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరిన పాకిస్తాన్..
- బోర్డు సభ్యుడిగా ఉండేందుకు 1 బిలియన్ డాలర్లు ఖర్చు..
- మరోవైపు యూఏఈ, ఐఎంఎఫ్ నుంచి అప్పు కోసం ప్రయత్నం..
- ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందా అని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ అంతర్జాతీయంగా తాను పెద్ద దేశాన్ని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టించుకోవడం లేదు. తాజాగా, ట్రంప్ ప్రతిపాదితన గాజాకు సంబంధించిన ‘‘బోర్డ్ ఆఫ్ పీస్‘‘లో చేరిన 8 ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, పునర్నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఈ బోర్డును ఏర్పాటు చేశాడు. దీంట్లో చేరుతున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
Read Also: Air India Loss: టాటా గ్రూప్కు ఎయిర్ ఇండియా షాక్.. ఏకంగా రూ.15 వేల కోట్ల భారీ నష్టం! రీజన్ ఇదే..
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
ఇక్కడ పాకిస్తాన్ దరిద్రం ఏంటంటే, ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో శాశ్వత సభ్యుడిగా చేరడానికి దాదాపు 1 బిలియన్ డాలర్లను(దాదాపు ₹8,300 కోట్లు) చెల్లిస్తోంది. ఈ డబ్బుల్ని చెల్లించేందుకు కూడా పాక్ సిద్ధమైంది. ఇదే సమయంలో యూఏఈ నుంచి 2.2 బిలియన్ డాలర్ల అప్పును కోరుతోంది. మరోవైపు, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల రుణ పథకం కొనసాగింపు కోసం ప్రయత్నిస్తోంది.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అయినా కూడా అంతర్జాతీయ వేదికలపై గప్పాలు కొడుతోంది. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి, ఆ దేశంలో ద్రవ్యోల్భణం, నిరుద్యోగాలు పీక్స్కు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాజా శాంతి బోర్డులో గొప్పల కోసం చేరడం అవసరమా అని పాక్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ బోర్డులో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, ఖతర్, యూఏఈ, పాకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రతీ శాశ్వత సభ్య దేశం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిర్ణయాన్ని పాక్ సమర్థించుకుంటుంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. గాజా శాంతి ప్రణాళికకు మద్దతు ఇచ్చే కీలక వేదిక అని, శాశ్వత కాల్పుల విరమణ దిశగా ఇది సహాయపడుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!