India-Pakistan War: వెనక్కి తగ్గిన పాకిస్తాన్..! భారత్ ముందు కీలక ప్రతిపాదన..
- భారత్తో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్..!..
- విదేశాంగమంత్రి ఇషాక్ దార్.. భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన..
- భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటన..
- పాకిస్తాన్పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan War: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతారణం నెలకొంది.. దాడులు, ప్రతిదాడులు.. దాడులను తిప్పికొట్టడం ఇలా దేశాల సరిహద్దుల్లో యుద్ధమే నడుస్తోంది.. పహల్గామ్ దాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులకు దిగగా.. భారత్ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే పలు ఆర్మీ బేస్లతో పాటు సరిహద్దుల్లోనూ భారీగా నష్టాన్ని చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు ఓవైపు దాడులు చేస్తూనే.. మరోవైపు భారత్లో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తోంది.. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్.. భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు..
Read Also: Vennela Kishore : అప్పటిదాకా డైరెక్షన్ చేయను!
Also Read
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్తాన్పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడించారు.. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం అని పేర్కొన్నారు.. ఇదే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశామని వెల్లడించారు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఇషాక్ దార్.. కాగా, ఈ రోజు పాక్ ఆర్మీ చీఫ్ కు ఆమెరికా విదేశాంగ మంత్రి రుబియా ఫోన్ చేసిన విషయం విదితమే.. కాల్పులు విరమించాలని పాక్ను కోరారు ఆమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో.. మరోవైపు.. భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్కు అమెరికా విదేశాంగ మంత్రి రుబియో ఫోన్ చేసి… ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.. ఉద్రిక్తతలు తగ్గించుకునే చర్యలు చేపట్టాలని రుబియో సూచించిన విషయం విదితమే..
Read Also: No Firecrackers : హైదరాబాద్లో బాణసంచా కాల్చడం నిషేధం..
కానీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నంలో పాక్ ఉంది.. భారత బలగాలను రెచ్చగొడుతూనే ఉంది.. సరిహద్దుల వెంట ముందుకు చొచ్చుకొచ్చాయి పాక్ బలగాలు.. ఇదే సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధం అయ్యింది.. ఇక, జైసల్మేర్ టార్గెట్గా పాక్ దాడులకు పూనుకుంది.. జైసల్మేర్ వ్యాప్తంగా ఉదయం నుంచే ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు, ఆర్మీ.. జైసల్మేర్ కు 6 కి.మీ పరిధిలో ఉన్న గిడా గ్రామంలో మిస్సైల్స్ ను భారత ఆర్మీ కూల్చివేసింది.. ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.. జైసల్మేర్ ప్రధాన రహదారులను ఖాళీ చేయించాయి భద్రతాదళాలు.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఒక్కరు కూడా బయటకు రావొద్దని స్పష్టం చేసింది.. రెండు రోజుల పాటు రాత్రి సమయంలోనే దాడులకు పాల్పడిన పాక్.. ఈ రోజు తన పంతాను మార్చి.. ఉదయం నుంచి దాడులు కొనసాగిస్తోంది.. ఇప్పుడు పాక్ విదేశాంగ మంత్రి ప్రతిపాదనతో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తున్నా.. బోర్డర్ నుంచి వెనక్కి తగ్గుతుందా? ఇంకా ఉధృతం చేస్తుందా అనేది తేలాల్సి ఉంది..
తాజావార్తలు
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!