Pakistan: “రాత్రి 8 గంటల తర్వాత పిల్లలు పుట్టరట”.. పాక్ మంత్రి కొత్త సిద్ధాంతం.. ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan defence minister’s bizarre theory about population growth: పాకిస్తాన్ మంత్రులు, అక్కడి ప్రజల అవివేకం చాలా సందర్భాల్లో చూశాం. తెలిసీతెలియని విధంగా కొత్తకొత్త ప్రతిపాదనలు, సిద్ధాంతాలు పుట్టించడంలో పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధహస్తులు. ఏ సమస్య వచ్చినా.. కూడా ఆర్మీ, అటామిక్ ముల్క్ అని చెప్పడం తప్పితే పాకిస్తాన్ పెద్దగా చేయగలిగింది ఏం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా అక్కడి ప్రభుత్వానికి తత్వం బోధపడటం లేదు. ఎంతసేపు భారత్ వ్యతిరేకత, కాశ్మీర్ అంటూ మాట్లాడటం తప్పితే, దేశంలోని ఇతర ప్రాంతాల గురించి ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జనాభా పెరుగుదలపై ఓ సిద్ధాంతాన్ని ప్రకటించారు. దీనిపై నెటిజెన్లు ఓ రేంజులో పాక్ మంత్రిని ట్రోల్ చేస్తున్నారు. ‘‘రాత్రి 8 గంటల వరకు మార్కెట్లు మూతపడిన ప్రదేశాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది’’ అంటూ ఓ విచిత్రమైన సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మంత్రి వ్యాఖ్యలను జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి.
Also Read
Read Also: Tragedy: పశ్చిమ బెంగాల్లో విషాదం.. తల్లి శవాన్ని 50కి.మీ. మోసిన కొడుకు
‘‘ కొత్త పరిశోధన, రాత్రి 8 గంటల తర్వాత పిల్లలను తయారు చేయడం సాధ్యం కాదు. రాత్రి 8 గంటలకు మార్కెట్లు ముగిసే దేశాల్లో జనాభా పెరగడం లేదు’’ అంటూ నైలా ఇనాయత్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మంత్రి చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘ వాహ్ క్యాలాజిక్ హై’’ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేస్తే..మరొకరు ‘‘ మార్కెట్ లో పిల్లలు పుడుతున్నారా..?’’ అంటూ ప్రశ్నించారు. ఈ కామెంట్ చేసిన సందర్భంలో మంత్రి పక్కన ఉన్న మహిళ రియాక్షన్ హైలెట్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్తాన్ మరో శ్రీలంక కాబోతోంది. చివరకు ఉద్యోగులు, సైనికుల జీతాల్లో కోతలు విధించడంతో పాటు విదేశాల్లో ఉన్న ఎంబీసీ ఆస్తులను అమ్మేస్తోంది. తాజాగా విద్యుత్ వినియోగాన్ని తప్పించుకునేందుకు రాత్రి 8 గంటలకే మార్కెట్లు బంద్ చేయాలని ఆదేశించింది. దీంతో చమురు ఖర్చులను ఆదా చేయవచ్చని భావిస్తోంది. ఇక ఉదయం పూటే సమావేశాలు నిర్వహించాలని సూచించింది.
New research, babies can’t be made after 8pm. “There’s no population increase in countries where markets close at 8pm,” defence minister. pic.twitter.com/G5IUAuOYD6
— Naila Inayat (@nailainayat) January 4, 2023
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!