Pakistan: ప్రజలు వద్దు, చైనీయులు ముద్దు.. వారి రక్షణ కోసం భారీగా పోలీస్ భద్రత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడి ప్రజలు ఏమైనా పర్వాలేదు కానీ చైనీయులకు మాత్రం ఎలాంటి హానీ కలగకూడదని భావిస్తోంది. అప్పుల్లో కూరుకుపోవడానికి ఓ రకంగా కారణం అయిన చైనాను ఇంకా పాకిస్తాన్ నమ్ముతూనే ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొంతలో కొంత చైనా, పాక్ కు మళ్లీ రుణాలు ఇస్తోంది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టుతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో చైనీయులు పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో వీరిపై దాడులు తీవ్రం అయ్యాయి. ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వాలో పనిచేస్తున్న చైనీయులే టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
Read Also: Tillu Venu: ‘బలగం’ కథ మా నాన్న చావు నుంచి రాసుకున్నా… కథ ఎవరిదో కాదు
Also Read
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాకిస్థాన్ స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ (ఎస్ఎస్యు)కి చెందిన 1,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించింది. వీరంతా చైనీయులకు భద్రత కల్పించనున్నారు. వీరితో పాటు స్థానికంగా ఉండే జిల్లా పోలీసులు అదనం. ఎలైట్ ఫోర్స్, ఫ్రాంటియర్ రిజర్వ్ పోలీస్ కూడా ఈ ప్రాంతంలో మోహరించారు.
ఓ నివేదిక ప్రకారం ఖైబర్ ప్రాంతంలో గతేడాది 495 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇదిలా ఉంటే ఇక బలూచిస్తాన్ గ్వాదర్ పోర్టులో పనిచేస్తున్న చైనా జాతీయులకు ఎలాంటి లోపం లేకుండా భద్రత కల్పిస్తామని అక్కడి హోం మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన ఆయన భద్రతను పర్యవేక్షించారు. ఇటీవల కాలంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో సైనికులు, పోలీసులు, చైనీయులే లక్ష్యంగా పాకిస్తాన్ తాలిబాన్లు దాడులకు తెగబడుతున్నారు. ఇక బలూచిస్తాన్లో, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వేర్పాటువాదులు చైనీయులకు, పాక్ సైన్యానికి చుక్కలు చూపెడుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రజలు, పోలీసులకు దాడుల నుంచి రక్షణ లేదు, కానీ చైనీయులకు మాత్రం పాక్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.
తాజావార్తలు
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!