Trump-Modi: అక్టోబర్లో మోడీ-ట్రంప్ భేటీ..! ఎక్కడంటే..!
- అక్టోబర్లో మోడీ-ట్రంప్ భేటీ..!
- ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో కలిసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే కలవబోతున్నారు. అక్టోబర్లో కౌలాలంపూర్లో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ, ట్రంప్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. మలేసియా వేదికగా జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలకు మోడీ రెగ్యులర్గా హాజరవుతుంటారు. అయితే ఈసారి ఈ సమావేశాలకు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ-ట్రంప్ కీలక సమావేశం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: మోడీ మంచి స్నేహితుడే కానీ..! బ్రిటన్ టూర్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
మలేసియా రాజధాని కౌలాలంపూర్లో 47వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 26-28 మధ్య ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అనేక మంది నాయకులు హాజరవుతున్నారు. మోడీ-ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఇద్దరి మధ్య సమావేశం ఉంటుందా? లేదా? అనేది ఇరు దేశాల నుంచి ఎలాంటి సమాచారం వెలువడ లేదు. అయితే ప్రస్తుతం సుంకాల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణాన ఇద్దరి మధ్య భేటీ జరగొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: నా రెస్టారెంట్లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
ఇక ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతున్నట్లు ట్రంప్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలియజేసినట్లు మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. మోడీ పర్యటన అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా.. గతంలో రెగ్యులర్గా హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా పాల్గొంటారని సమాచారం. ఇక ఈనెలాఖరులో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశానికి మోడీ అమెరికా వెళ్లనున్నట్లు ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే సెప్టెంబర్ 16న ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో తిరిగి రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!