Kangana Ranaut: నా రెస్టారెంట్లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
- నా రెస్టారెంట్లో రూ.50 వచ్చాయి
- నా బాధ ఎవరితో చెప్పుకోను
- వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది క్లౌడ్ బరస్ట్లు కారణంగా హిమాచల్ప్రదేశ్ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు చెందిన మండి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ నష్టాన్ని చవిచూసింది.
ఇది కూడా చదవండి: Earthquake: రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
Also Read
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
అయితే గురువారం మండి నియోజకవర్గంలో కంగనా రనౌత్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ గోడును కంగనాకు చెప్పుకున్నారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కౌంటర్గా కంగనా తన బాధను ఎవరితో చెప్పుకోవాలంటూ రెస్టారెంట్ స్టోరీ మొదలు పెట్టారు.
నిన్న తన రెస్టారెంట్ అమ్మకాల్లో కేవలం రూ.50 మాత్రమే వచ్చాయని.. ప్రతి నెల ఉద్యోగులకు రూ.15 లక్షలు ఇస్తున్నానని.. దయచేసి తన బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలని రివర్స్గా నిట్టూర్పు విడిచింది. దీంతో వరద బాధితులంతా షాక్కు గురయ్యారు. తాను కూడా హిమాచల్ప్రదేశ్ ప్రాంత వాసినేనని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Off The Record: డ్యామేజ్ కంట్రోల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
కంగనా రనౌత్ ఈ ఏడాది ప్రారంభంలో మనాలిలో రెస్టారెంట్ ది మౌంటైన్ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాలో పబ్లిసిటీ కూడా చేశారు. రెస్టారెంట్లో హిమాచల్ప్రదేశ్కు చెందిన అద్భుతమైన వంటకాలు అందించబడతాయని ప్రచారం చేశారు. అయితే ఈ రెస్టారెంట్ కేవలం పర్యాటకులకు మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే కొద్దిరోజులుగా భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో వ్యాపారం నడవడం లేదు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధి.. తన ఆర్థిక కష్టాలు చెప్పుకోవడంతో వరద బాధితులు ఆశ్చర్యపోవడం వంతైంది.
కంగనా… సోలాంగ్, పాల్చన్ ప్రాంతాల్లో పర్యటించారు. కంగనాతో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ ఠాకూర్ ఉన్నారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని కంగనా చెప్పుకొచ్చారు. ఇక హిమాచల్ప్రదేశ్లో వరదలు కారణంగా ఇప్పటి వరకు 419 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?