Kangana Ranaut: నా రెస్టారెంట్లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
- నా రెస్టారెంట్లో రూ.50 వచ్చాయి
- నా బాధ ఎవరితో చెప్పుకోను
- వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది క్లౌడ్ బరస్ట్లు కారణంగా హిమాచల్ప్రదేశ్ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు చెందిన మండి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ నష్టాన్ని చవిచూసింది.
ఇది కూడా చదవండి: Earthquake: రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
అయితే గురువారం మండి నియోజకవర్గంలో కంగనా రనౌత్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ గోడును కంగనాకు చెప్పుకున్నారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కౌంటర్గా కంగనా తన బాధను ఎవరితో చెప్పుకోవాలంటూ రెస్టారెంట్ స్టోరీ మొదలు పెట్టారు.
నిన్న తన రెస్టారెంట్ అమ్మకాల్లో కేవలం రూ.50 మాత్రమే వచ్చాయని.. ప్రతి నెల ఉద్యోగులకు రూ.15 లక్షలు ఇస్తున్నానని.. దయచేసి తన బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలని రివర్స్గా నిట్టూర్పు విడిచింది. దీంతో వరద బాధితులంతా షాక్కు గురయ్యారు. తాను కూడా హిమాచల్ప్రదేశ్ ప్రాంత వాసినేనని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Off The Record: డ్యామేజ్ కంట్రోల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
కంగనా రనౌత్ ఈ ఏడాది ప్రారంభంలో మనాలిలో రెస్టారెంట్ ది మౌంటైన్ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాలో పబ్లిసిటీ కూడా చేశారు. రెస్టారెంట్లో హిమాచల్ప్రదేశ్కు చెందిన అద్భుతమైన వంటకాలు అందించబడతాయని ప్రచారం చేశారు. అయితే ఈ రెస్టారెంట్ కేవలం పర్యాటకులకు మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే కొద్దిరోజులుగా భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో వ్యాపారం నడవడం లేదు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధి.. తన ఆర్థిక కష్టాలు చెప్పుకోవడంతో వరద బాధితులు ఆశ్చర్యపోవడం వంతైంది.
కంగనా… సోలాంగ్, పాల్చన్ ప్రాంతాల్లో పర్యటించారు. కంగనాతో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ ఠాకూర్ ఉన్నారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని కంగనా చెప్పుకొచ్చారు. ఇక హిమాచల్ప్రదేశ్లో వరదలు కారణంగా ఇప్పటి వరకు 419 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!