Congress Vs BJP: కుంభమేళాకు హాజరుకాకపోవడంపై నేతల మధ్య మాటల యుద్ధం
- బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం
- కుంభమేళాకు హాజరుకాకపోవడంపై నేతల మధ్య డైలాగ్ వార్
- సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీలు విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుంభమేళా, అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధాని మోడీ గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్పై బీజేపీ మాటల దాడి చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. 2024లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరకాలేదు. 2025లో మహా కుంభమేళాకు కాంగ్రెస్ నాయకులు హాజరుకాలేదని.. వాళ్లంతా హిందూ వ్యతిరేకులని బీజేపీ ధ్వజమెత్తింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఫొటోలు పెట్టి విమర్శలు చేసింది.
ఇది కూడా చదవండి: Prashanth Reddy: ఎస్ఎల్బీసీని మంత్రులు వినోద యాత్రగా మార్చుకున్నారు
Also Read
‘‘రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తుంది. వారు బాబర్ (అయోధ్యలోని బాబ్రీ మసీదు) నిర్మించిన మసీదుకు మూడుసార్లు వెళ్లారు కానీ రాముడి ఆలయంలో శ్రీరాముని దర్శనం కోసం వెళ్లలేదు. రాహుల్ గాంధీ తరచుగా రాయ్బరేలికి వెళ్తారు. కానీ ఆయన ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా జరిగే ప్రదేశానికి వెళ్లలేకపోయారు. ఇది కేవలం 2 గంటల రెండు నిమిషాల 120 కి.మీ. దూరంలో ఉంది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి పేర్కొన్నారు.
ఇక హిందీ పోస్టులో బీజేపీ మరో విమర్శ చేసింది. ‘‘శతాబ్దాల పోరాటం మరియు నిరీక్షణ తర్వాత అయోధ్యలో ఒక గొప్ప రామాలయం నిర్మించబడింది. మోడీ చేతుల మీదుగా జనవరి 22, 2024న రామ్లాలా ప్రాణ ప్రతిష్ట జరిగింది. కానీ ఆలయ నిర్మాణాన్ని ఎప్పుడూ వ్యతిరేకించే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఆహ్వానం అందుకున్న తర్వాత కూడా వేడుకకు హాజరు కాలేదు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును సంతృప్తి పరచుకోవడానికి హిందువుల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీస్తుంది’’ అని బీజేపీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: AA23 : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మరొక హీరో.?
బీజేపీ విమర్శలను మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఖండించారు. బీజేపీ వాదన ప్రకారం.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి వంటి మిత్రపక్షాల నాయకులు కూడా కుంభమేళాకు హాజరుకాలేదు. వీళ్లను కూడా హిందూ వ్యతిరేకులుగా పరిగణించాలా? అని బీజేపీని ప్రశ్నించారు.
सदियों के लंबे संघर्ष और इंतजार के बाद अयोध्या में भव्य राम मंदिर का निर्माण हुआ, जिसमें प्रधानमंत्री श्री @narendramodi के कर कमलों द्वारा 22 जनवरी, 2024 को प्रभु श्री रामलला की प्राण प्रतिष्ठा हुई।
लेकिन हमेशा से ही मंदिर निर्माण का विरोध करने वाली कांग्रेस और राहुल गांधी… pic.twitter.com/JZjr5Ai9ga
— BJP (@BJP4India) March 2, 2025
Dear @BJP4India,
Here’s a list of more so-called “anti-Hindus” who didn’t attend #MahaKumbh:
•Half of your Union Ministers
•More than half of BJP legislators across the country
•Most of your IT Cell warriorsAnd let’s not forget your allies:
•Sri Nitish Kumar
•Sri… https://t.co/t8G9W1wrKC— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) March 2, 2025
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!