Jai Shankar: భారత్, చైనా మధ్య సంబంధాలపై జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Shankar Says India-China Relations Are Not Normal: భారత్-చైనా సరిహద్దు సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత లేనంతవరకూ.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి రాలేవని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంపై తాము ఇప్పటికే చైనా నాయకత్వంతో పలుమార్లు చర్చించామని.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్యదేశాల విదేశాంగశాఖ మంత్రుల మండలి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Anasuya: గాలికిపోయే కంపను మళ్లీ తగిలించుకోవడం అవసరమా ‘ఆంటీ’
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
అంతకుముందు గురువారం.. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణ కోసం తూర్పు లడఖ్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంతో పాటు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంట శాంతి, ప్రశాంతతను కొనసాగించాల్సిన ఆవశ్యకతను చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్కు జైశంకర్ నొక్కి చెప్పారు. ఎస్సిఓ సదస్సు సందర్భంగా.. గోవాలోని తాజ్ ఎక్సోటికా రిసార్ట్లో ఈ ఇద్దరు విదేశాంగ మంత్రులు దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. అపరిష్కృతమైన సమస్యలను పరిష్కరించడం, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి & ప్రశాంతతను నిర్ధారించడంపై ఈ చర్చ ఉద్దేశమని ఆయన ట్వీట్లోనూ పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణ సరిహద్దు వివాదంపై కేంద్రీకృతమైందని, సకాలంలో పరిష్కారం కోసం జైశంకర్ ఒత్తిడి చేశారని ఓ వార్తా సంస్థ పేర్కొంది.
RR vs GT: రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
గత రెండో నెలల్లో జైశంకర్, క్విన్లు ఇలా రెండోసారి సమావేశం అయ్యారు. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు చైనా విదేశాంగ మంత్రి మార్చిలో భారత్కు వచ్చారు. ఆ పర్యటనలో, తూర్పు లడఖ్లో కొనసాగుతున్న సరిహద్దు వివాదం భారత్-చైనా సంబంధాలు ‘అసాధారణ’గా మారడానికి కారణమైందని క్విన్కు జైశంకర్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!