Jai Shankar: భారత్, చైనా మధ్య సంబంధాలపై జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Shankar Says India-China Relations Are Not Normal: భారత్-చైనా సరిహద్దు సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత లేనంతవరకూ.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి రాలేవని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంపై తాము ఇప్పటికే చైనా నాయకత్వంతో పలుమార్లు చర్చించామని.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్యదేశాల విదేశాంగశాఖ మంత్రుల మండలి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Anasuya: గాలికిపోయే కంపను మళ్లీ తగిలించుకోవడం అవసరమా ‘ఆంటీ’
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
అంతకుముందు గురువారం.. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణ కోసం తూర్పు లడఖ్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంతో పాటు వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంట శాంతి, ప్రశాంతతను కొనసాగించాల్సిన ఆవశ్యకతను చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్కు జైశంకర్ నొక్కి చెప్పారు. ఎస్సిఓ సదస్సు సందర్భంగా.. గోవాలోని తాజ్ ఎక్సోటికా రిసార్ట్లో ఈ ఇద్దరు విదేశాంగ మంత్రులు దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. అపరిష్కృతమైన సమస్యలను పరిష్కరించడం, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి & ప్రశాంతతను నిర్ధారించడంపై ఈ చర్చ ఉద్దేశమని ఆయన ట్వీట్లోనూ పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణ సరిహద్దు వివాదంపై కేంద్రీకృతమైందని, సకాలంలో పరిష్కారం కోసం జైశంకర్ ఒత్తిడి చేశారని ఓ వార్తా సంస్థ పేర్కొంది.
RR vs GT: రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
గత రెండో నెలల్లో జైశంకర్, క్విన్లు ఇలా రెండోసారి సమావేశం అయ్యారు. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు చైనా విదేశాంగ మంత్రి మార్చిలో భారత్కు వచ్చారు. ఆ పర్యటనలో, తూర్పు లడఖ్లో కొనసాగుతున్న సరిహద్దు వివాదం భారత్-చైనా సంబంధాలు ‘అసాధారణ’గా మారడానికి కారణమైందని క్విన్కు జైశంకర్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?