Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
- ఖమేనీ ఉంటున్న ప్రాంతంలోనే ఇరాన్ అధ్యక్ష కార్యాలయం
- సమీప ప్రాంతాల్లోనే ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత 24 గంటల నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతోంది. ఇక శనివారం జరిపిన దాడుల్లో.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఖమేనీ నివాసం సమీపంలో క్షిపణులు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. టెహ్రాన్లోని మోనిరియాలో ఖమేనీ నివాసం ఉంది. అక్కడే ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది. ఈ సమీపంలోనే ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ మేరకు ఇరాన్ స్థానిక మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి: Israel Iran Conflict: ఇరాన్తో సంఘర్షణ.. భారత్కు క్షమాపణ చెప్పిన ఇజ్రాయిల్..
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ఇరాన్ మిలటరీ చీఫ్గా అమీర్ హతామీని ఖమేనీ నియమించారు. శుక్రవారం జరిగిన దాడుల్లో మిలటరీ చీఫ్ బాఘేరి చనిపోయారు. బాఘేరి.. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు. అలాంటి నాయకుడు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు.
ఇది కూడా చదవండి: Kethireddy Pedda Reddy: మరోసారి కేతిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. నా ఇంటికి నన్నే వెళ్లనివ్వరా..?
ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. 24 గంటల్లో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడింది. శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక నేతలంతా హతమయ్యారు. ఇక తాజాగా శనివారం మరొకసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందారని ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి అమీర్ సయీద్ తెలిపారు. 320 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పౌరులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్.. ఇరాన్లోని సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని తెలిపారు.
ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది. కేవలం ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో అణు శాస్త్రవేత్తల సహా ఇరాన్ కీలక నేతలంతా చనిపోయారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్.. అణు కార్యక్రమంతో టెల్ అవీవ్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులు ప్రారంభించింది. మొదటి దాడికి ప్రతీకారంగా 100 డ్రోన్లు ప్రయోగించింది. వీటిని ఇజ్రాయెల్ గాల్లోనే తిప్పికొట్టింది. తాజాగా రెండో దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. నివాసాల సమీపంలో పడడంతో 10 మంది గాయపడ్డారు. ఇక వీటిని కూడా ఐడీఎఫ్ ఎదుర్కొంది.
తాజావార్తలు
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!