Israel: అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్, డాక్టర్లను అరెస్ట్ చేసిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో గాజా ప్రాంతంలోని అల్-షిఫా ఆస్పత్రి హాట్స్పాట్గా మారింది. ఈ ఆస్పత్రినే హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్గా, ఆయుధాలు దాచేందుకు స్థావరంగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆర్మీ ఆధారాలతో బయటపెట్టింది. ఆస్పత్రి కింద టన్నెల్స్, ఇతర ఏర్పాట్లను గుర్తించింది. ఇదే కాకుండా గాజాలోని పలు ఆస్పత్రుల కింద ఇలాంటి నిర్మాణాలే ఉన్నాయని ఇజ్రాయిల్ పేర్కొంది.
ఇదిలా ఉంటే అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్తో పాటు ఇతర డాక్టర్లను ఇజ్రాయిల్ దళాలు గురువారం అరెస్ట్ చేశాయి. డైరెక్టర్ మొహమ్మద్ అబు సాల్మియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇతను అల్-షిఫా ఆస్పత్రి పరిణామాలు, ఇజ్రాయిల్ దాడుల గురించి తరుచుగా ఇంటర్నేషనల్ మీడియాకు వెల్లడిస్తుండే వాడు. ఇజ్రాయిల్ భూతల దాడులు ప్రారంభించనప్పటి నుంచి ఈ ఆస్పత్రిపై వరసగా దాడులు నిర్వహించింది.
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
Read Also: CM KCR: అధికారంలోకి వస్తే ముస్లిం యువత కోసం కొత్త ఐటీ పార్క్..
ఈ ఆస్పత్రిలోని చాలా ప్రాంతాల్లో హమాస్ కార్యకలాపాలను ఇజ్రాయిల్ గుర్తించింది. అయితే దీన్ని హమాస్ ఉగ్రవాదులు ఖండించారు. డాక్టర్ మహ్మద్ అబు సాల్మియాతో పాటు మరికొందరు సీనియర్ వైదుల్ని అరెస్ట్ చేసినట్లు ఆస్పత్రి విభాగం చీఫ్ ఖలీద్ అబు సమ్రా కూడా ధృవీకరించారు.వ వీరిని అరెస్ట్ చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. రెడ్ క్రాస్, ఇతర సంస్థలకు వీరి విడుదల గురించి పిలుపునిచ్చింది. ఈ ఆస్పత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చాలా మంది రోగులు కాలినడకనే దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లారు.
అక్టోబర్ 7న జరిగిన దాడిలో హమాస్ ఇజ్రాయిల్ లోని 1200 మంది చంపేసింది. దీంతో పాటు 240 మందిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేలకు మించి ప్రజలు చనిపోయారు. వీరిలో చాలా మంది పిల్లలు కూడా ఉండటంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..