Rich Persons List: బ్రిటన్ శ్రీమంతుల జాబితాలో భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్లోని శ్రీమంతుల జాబితాపై సండే టైమ్స్ అనే సంస్థ ఈ ఏడాది సర్వే చేసి 250 మంది పేర్లను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత్కు చెందిన రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి 222వ స్థానంలో నిలిచారు. ఈ దంపతుల ఆస్తుల విలువ రూ.7074 కోట్లుగా సండేటైమ్స్ ప్రకటించింది. గత 34 ఏళ్లుగా యునైటెడ్ కింగ్డమ్లోని శ్రీమంతుల జాబితాను సండే టైమ్స్ ప్రతి ఏడాది విడుదల చేస్తోంది. అయితే తొలిసారి ఈ జాబితాలో బ్రిటన్కు చెందిన రాజకీయ నేతలు స్థానం సంపాదించడం విశేషం.
Milk Shortage: అమెరికాలో తల్లిపాల కొరత.. ఎక్కడ చూసినా నో స్టాక్..!!
Also Read
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
అయితే బ్రిటన్లోని 250 మంది శ్రీమంతుల జాబితాలో పదుల సంఖ్యలో భారతీయుల పేర్లు ఉండటం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా హిందూజా గ్రూప్కు చెందిన గోపీచంద్ హిందూజాతో పాటు వారి కుటుంబీకులు యూకే శ్రీమంతుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. వీరి ఆస్తి విలువ రూ.2.75 లక్షల కోట్లుగా ఉన్నట్లు సండే టైమ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్, వారి కుటుంబ సభ్యులు 17 బిలియన్ పౌండ్లతో ఆరో స్థానంలో ఉన్నారు. బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా ఈ జాబితాలో 913వ స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తి 2.5 బిలియన్ పౌండ్లుగా సండే టైమ్స్ తెలిపింది. కాగా రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఎవరో కాదు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె. ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తి 0.93 శాతం షేర్లను కలిగి ఉన్నారు. అంటే రూ.6,684 కోట్లు అన్నమాట.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!