India-Pakistan: అప్పుల కోసం పరుగులు పెడుతోంది.. యూఎన్లో పాక్పై భారత్ వ్యంగ్యాస్త్రాలు
- అప్పుల కోసం పరుగులు పెడుతోంది
- యూఎన్లో పాక్పై భారత్ వ్యంగ్యాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మతోన్మాదంలో మునిగిపోయి.. ఐఎంఎఫ్ నుంచి వరుస రుణాల కోసం పరుగులు పెడుతోందని పాకిస్థాన్పై భారత్ విరుచుకుపడింది. అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్నతస్థాయి చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాక్ విదేశాంగశాఖ మంత్రి ఇషాక్దార్ మళ్లీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. వివాదాస్పద భూభాగం అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. దీనికి ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పందిస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
Also Read
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశం.. భారత్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉపదేశాలు ఇవ్వడం తగదని హితవు పలికింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత్ దూసుకెళ్తుంటే.. పాక్ మాత్రం అప్పులు తీసుకోవడంలో బిజీగా ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఐఎంఎఫ్కు పాకిస్థాన్ వరుస రుణగ్రహీత అంటూ వ్యాఖ్యానించారు. ఇక పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను పర్వతనేని హరీష్ సమర్థించారు.
ఇది కూడా చదవండి: Delhi: కంత్రీ పోలీస్ జంట.. రికవరీ చేసిన రూ.2 కోట్లతో పరారై జల్సాలు
ఇదిలా ఉంటే భారత్-పాక్ ఉద్రిక్తతల అంశాన్ని మరోసారి అమెరికా ప్రస్తావించింది. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని పరిష్కరించడంలో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఐరాసలో వాషింగ్టన్ రాయబారి వ్యాఖ్యానించారు. దీనికి పర్వతనేని హరీశ్ స్పందింస్తూ.. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందన్నారు. పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు భారత ప్రతినిధి వెల్లడించారు.
తాజావార్తలు
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!