Delhi: కంత్రీ పోలీస్ జంట.. రికవరీ చేసిన రూ.2 కోట్లతో పరారై జల్సాలు
- ఢిల్లీలో కంత్రీ పోలీస్ జంట
- రికవరీ చేసిన రూ.2 కోట్లతో పరారై జల్సాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఖాకీలే.. పక్కదారి పట్టి పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చారు. సైబర్ నేరగాళ్లు కాజేసిన నగదును రికవరీ చేసి ఇదే అదునుగా భావించి ఓ పోలీస్ ప్రేమికుల జంట పరారయ్యారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Tanushree Dutta: కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న స్టార్ హీరోయిన్.. దయచేసి కాపాడండి అంటూ.. వీడియో వైరల్
Also Read
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
అంకుర్ మాలిక్ సబ్-ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. సైబర్ క్రైమ్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సైబర్ కేసులను డీల్ చేయడంతో రికవరి పేరుతో భారీగా నగదు తిరిగి రావడం చూసి కన్నుగిట్టింది. అంతే సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ చేసిన రూ.2 కోట్ల నగదును వేర్వేరు నకిలీ ఖాతాలు సృష్టించి మళ్లించాడు. అనంతరం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే క్రమంలో అంకుర్ మాలిక్ బ్యాచ్కు చెందిన మరో మహిళా ఎస్సై నేహా పునియాతో ఎప్పుటినుంచో రహస్యంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే డబ్బు చేతికి అందగానే మాలిక్.. ఏడు రోజులు సెలవు తీసుకున్నాడు. కానీ తిరిగి రాలేదు. ఇదే క్రమంలో పునియా కూడా విధులకు హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు దృష్టి పెట్టి విచారణ జరపగా రూ.2 కోట్లతో ఇద్దరు పరారైనట్లుగా గుర్తించారు. దీంతో వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Deepika : దీపిక చూపు ఇప్పుడు టాలీవుడ్ వైపు..
మాలిక్-పునియా కలిసి గోవా, మనాలి, కాశ్మీర్ వంటి పర్యాటక ప్రాంతాల్లో విహరించారు. అయితే అప్పటికే ఢిల్లీ పోలీసులు వేటాడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కూడా ఇండోర్లో గుర్తించి అరెస్ట్ చేశారు. నాలుగు నెలల తర్వాత జంటను అరెస్టైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారం, రూ.12 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, మూడు ఏటీఎం కార్డులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన డబ్బుతో జల్సాలు చేశారని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ 2021లో పోలీసు శిక్షణ సమయంలో స్నేహితులయ్యారని.. అప్పటినుంచి ఇద్దరూ రకరకాలైన మోసాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక మాలిక భార్య ఉత్తరప్రదేశ్లోని బరౌత్లో నివసిస్తుండగా.. పునియా భర్త ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇక దొంగిలించిన డబ్బును ఖాతాల్లోకి బదిలీ చేసిన మరో ముగ్గురు వ్యక్తులు మహ్మద్ ఇలియాస్, ఆఫి అలియాస్ మోను, షాదాబ్ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: MLA Kolikapudi: తిరువూరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హంగామా
- Tags
- affair
- Delhi
- Goa
- manali
- Police lovers
తాజావార్తలు
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!