Imran Khan: ఆర్టికల్ 370ని పునరుద్దరిస్తేనే భారత్తో చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: తినడానికి తిండి దొరక్కున్నా, అప్పుల కోసం ప్రతీ దేశాన్ని అడుక్కుంటున్న పాకిస్తాన్ నాయకులకు బుద్ధి రావడంత లేదు. మళ్లీ కాశ్మీర్ పాటే పాడుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్ కూడా మరోసారి కాశ్మీర్ పై వ్యాఖ్యలు చేశారు. భారత్ తో చర్చలు జరిపేందుకు కాశ్మీర్ ప్రతేక్ హెదాను, ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ప్రధాని మోదీని కోరాడు. 2019లో భారత పార్లమెంట్ రాజ్యాంగంలో జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి జమ్మూకాశ్మీర్, లడఖ్ లుగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
Read Also: Rahul Gandhi: ప్రధాని అదానీని రక్షిస్తున్నారని స్పష్టం అయింది.
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- US-Iran War: తగ్గేది లేదంటున్న ఇరాన్.. మధ్యవర్తులు ఖతార్, పాక్లను వదలడం లేదు..
లాహోర్ లో ఫారన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు ఇమ్రాన్ ఖాన్. చట్టబద్ధమైన పాలన లేకపోతే పాకిస్తాన్ కు భవిష్యత్తు ఉండదని, భారత్ నే తీసుకోండి అక్కడ చట్టబద్దపాలన ఉండటంతో పురోమిస్తోందని అన్నారు. నన్ను రాజకీయాలకు దూరంగా ఉంచడానికి దేశంలోని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని.. నన్ను ఎన్నికల్లో పోటీ చేయాకుండా అనర్హుడిగా ప్రకటించడానికి వారు పథకం వేశారని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాల వెనక ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ ఉన్నాడా..? అని మీడియా ప్రశ్నిస్తే, అతడు కూడా ఉండే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ బదులిచ్చాడు.
ప్రస్తుత లండన్ లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తనను అనర్హుడిగా చేయడాని భావిస్తున్నారని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ రానున్నట్లు ఇటీవల అతని పార్టీ ప్రకటించింది. పాకిస్తాన్ ముస్లింలీగ్(నవాజ్) పార్టీ దాని మిత్ర పక్షాలతో కలిసి రిగ్గింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వాకు పదవీ పొడగింపు ఇవ్వడం తన అతిపెద్ద తప్పిదం అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సైనిక వ్యవస్థ ఎలా ఉంటుందో తాను అర్థం చేసుకోలేకపోయానని అన్నారు. షరీఫ్, జర్దారీలు అవినీతిపరుల పక్షం అని.. పాకిస్తాన్ సైన్యానికి, ప్రజలకు మధ్య అగాధం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ దేశాన్ని దోచుకుంటున్నవారికి ఆర్మీ మద్దతు ఇస్తోందని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?