Canada: నిజ్జర్ హత్య దర్యాప్తులో భారత్ పాల్గొనాలి.. కెనడా విదేశాంగ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసింది. ఈ హత్య కుట్రలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని, భారత్కి చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తిపై అభియోగాలు మోపింది. నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వంలోని ఉద్యోగి హ్యండ్లర్గా వ్యవహరిస్తూ.. పన్నూ హత్యకు ప్రణాళిక వేశాడని అమెరికన్ న్యాయశాఖ నేరారోపణ పత్రాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని కెనడాలోని సర్రే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని చెబుతూ కెనడా ఆరోపించింది. తాజాగా అమెరికా కూడా ఆరోపణలు చేస్తుండటంతో కెనడా మరింతగా స్వరాన్ని పెంచింది. అయితే ఈ రెండు దేశాల ఆరోపణల్ని భారత్ కొట్టిపారేసింది.
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
Read Also: Madhya Pradesh: శివరాజ్‘రాజ్’సింగ్దే మధ్యప్రదేశ్.. మళ్లీ కమలానిదే హవా..
తాజాగా ఈ వ్యవహారంపై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ గురువారం మాట్లాడారు. నిజ్జర్ హత్య దర్యాప్తులో భారత్ పాల్గొనడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు. 41 మంది కెనడా దౌత్యవేత్తలను భారత్ నుంచి తొలగించడాన్ని ఆమోదయోగ్య నిర్ణయం కాదని ఆమె చెప్పారు. ‘‘భారత్తో మేము ఎదుర్కొంటున్న సమస్యలపై నా అమెరికన్ సహచరులతో, సెక్రటరీ బ్లింకెన్తో అనేక సార్లు మాట్లాడానని, అదే సమయంలో దర్యాప్తులో నిమగ్నం కావాలని మేము భారత్ని పిలుస్తామని, ఇది ముఖ్యమైందిగా భావిస్తున్నాము’’ అని మెలానీ జోలి అన్నారు. భారత్పై ‘విశ్వసనీయ ఆరోపణ’కు దేశం అండగా ఉంటుందని ఆమె అన్నారు.
భారత ప్రధానమంత్రిని, వారి న్యాయవ్యవస్థను గౌరవిస్తాను, అయితే కెనడియన్ గడ్డపై ఓ కెనడా పౌరుడిని చంపడం భారత్ ఏజెంట్లతో ముడిపడి ఉందనే విశ్వసనీయ ఆరోపణలకు మేము కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పారు. ఈ అంశంపై భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మా దర్యాప్తుకు సహకరించాలని భారత్ని కోరుతున్నామని ఆమె చెప్పింది.
బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని సర్రే నగరంలో గురుద్వారా ముందు ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సంస్థ చీఫ్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే భారత్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తూ.. కెనడావి అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత ఆరోపణని చెప్పింది.
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!