Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malkajgiri: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరులో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. తాజాగా ఈ దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో నేపాలీ గ్యాంగ్ను ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల 12వ తేదీన రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన మమత, రాజేశ్ అనే పనివాళ్లు తమ సహచరులతో కలిసి దోపిడీకి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. ఇంట్లో పనికి చేరిన కేవలం 13 రోజులకే వారు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళికతో దోపిడీకి దిగిన నిందితులు మురళీధర్ మోహన్కు మత్తుమందు ఇచ్చి, ఆయన భార్య విజయలక్ష్మిని బెదిరించి నగదు, విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యారు. అనంతరం నేపాల్కు పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు వారి జాడను గుర్తించారు. ఈ దోపిడీకి రాజేశ్, మమతలతో పాటు సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్ తదితరులు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా గత నెల 16న సునిత, బిశ్వాల్, కమల్ బహదూర్, శంకర్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. తాజాగా పరారీలో ఉన్న మరో నలుగురు ప్రధాన నిందితులను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీకి సంబంధించిన ఆస్తుల స్వాధీనం, ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇక ఈ కేసుపై మల్కాజ్గిరి సీపీ సుమతి వివరణ ఇచ్చారు. “రిటైర్డ్ ఇంట్లో ఏప్రిల్ 25 న ప్రొఫెసర్ ఇంట్లో నేపాల్కు చెందిన మీనా, సబీనాను పనిమనిషిగా పెట్టిస్తుంది. సబీనా భర్తగా రాజేష్ను ప్రొఫెసర్కు పరిచయం చేసింది. ఆ తర్వాత ఎంతో నమ్మకంగా విశ్వాసంగా పనిచేశారు. అంత నమ్మకాన్ని యజమానులకు, విదేశాలలో ఉన్న వారి పిల్లలకు నిందితులు కలిగించారు. గత నెల 11 న మీనా బర్త్ డే పేరుతో దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేశారు. ప్రొఫెసర్ ఇంట్లో మొత్తం ఏడుగురు కలిసి దోపిడీకి పాల్పడ్డారు. దోపిడి చేసిన తరువాత ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. సరిహద్దు వద్ద పెద్ద పెద్ద చిత్రాలను అతికించాము. బోర్డర్ లో తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితులను తెచ్చాం. నేపాల్కు వెళ్ళేందుకు నలుగురు నిందితులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలోనే నిందితులను పట్టుకున్నాం. మీనా, రాజేశ్ లు నేపాల్కు చెందిన వారు. మమ్మల్ని తల్లిదండ్రులుగా చూస్తున్నామని నిందితులు తరుచూ మురళీధర్, విజయలక్ష్మీలకు మీనా, రాజేశ్లు చెప్పేవారు. అదే విషయాన్ని దోపిడీ సమయంలో నిందితులతో విజయలక్ష్మి అనింది. చాలా బాగా చూసుకున్నాము మిమ్మల్ని, మమ్మల్ని చంప్పొద్దని విజయలక్ష్మి కోరింది. ఇప్పటి వరకు 39 వేల 640 మందికి పైగా సురక్ష యాప్లో రిజిస్టర్ చేసుకున్నారు. మీనా పై 2023లో మొయినాబాద్ పీఎస్లో ఇప్పటికే నిందితురాలిగా ఉంది.” అని సీపీ వెల్లడించారు.
Also Read
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!