Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niger: సహారా ఎడారి గర్భంలో దారుణమైన విషాదం చోటుచేసుకుంది. ఉత్తర నైగర్ పరిధిలోని మారుమూల ఎడారి ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో, కనీసం 49 మంది ప్రయాణికులు తీవ్రమైన దాహంతో అల్లాడి ప్రాణాలు కోల్పోయారు. ముస్లింల పండుగ ‘ఈద్ అల్-అధా’ (బక్రీద్) వేడుకల కోసం మాలి దేశానికి వెళ్లిన నైగర్ పౌరులు, తిరిగి తమ స్వదేశానికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. నైగర్, అల్జీరియా సరిహద్దుల్లోని ప్రధాన చెక్పోస్టు అయిన ‘అస్సమాకా’కు పశ్చిమంగా దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రక్కు మొరాయించింది. దీంతో ప్రయాణికుల వద్ద ఉన్న తాగునీరు పూర్తిగా అయిపోయింది. అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు, నీడైనా దొరకని మైదానం, దానికి తోడు పరిసరాల్లో ఎలాంటి నీటి వనరులు లేకపోవడంతో ఆ ప్రాంతం మృత్యుకూపంగా మారింది. ఈ నరకప్రాయమైన పరిస్థితుల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారు ఎడారి గుండా కాలినడకన అస్సమాకా సరిహద్దు ప్రాంతానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
మాలిలోని ‘తల్హందెక్’ అనే పట్టణం నుంచి బయలుదేరిన ఆ లారీ, నిర్దేశిత మార్గం తప్పి ఎడారి వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వాహనం చెడిపోయిన తర్వాత డ్రైవర్, ప్రయాణికులు కలిసి కొన్ని రోజుల పాటు దానిని బాగు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఎండ తీవ్రతకు, నీరు లేక అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆగిపోయిన ఆ ట్రక్కు కింద, దాని చుట్టుపక్కల డజన్ల కొద్దీ నిర్జీవ దేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసిన రెస్క్యూ టీం చలించిపోయింది. మృతులంతా నైగర్ దేశస్థులే కావడంతో, స్థానిక యంత్రాంగం అక్కడికక్కడే వారందరికీ సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. అయితే, ఈ ఘోరకలి జరిగిన ప్రాంతం నుంచి రెస్క్యూ టీం తిరిగి వస్తున్న సమయంలో మరో ప్రమాదం తృటిలో తప్పింది. బ్యాటరీ పాడైపోవడంతో గత మూడు రోజులుగా ఎడారిలో చిక్కుకుపోయిన మరో లారీని రెస్క్యూ టీం గుర్తించింది. మాలిలోని హరుబా పట్టణం నుంచి బయలుదేరిన ఆ లారీలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. తీవ్ర నిస్సహాయ స్థితిలో, అలసటతో ఉన్న ఆ ప్రయాణికులకు నైగర్ సైనికులతో కూడిన రెస్క్యూ టీం వెంటనే తాగునీరు అందించి, వాహనాన్ని రిపేర్ చేసి వారిని సురక్షితంగా పంపించింది.
Also Read
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ఐరోపా దేశాలకు వెళ్లాలనుకునే పశ్చిమ ఆఫ్రికా వలసదారులకు ఈ నైగర్ ఎడారి ఒక ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ప్రాణాలకే ముప్పని తెలిసినా మెరుగైన ఉపాధి, జీవితం కోసం యువత ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఈ తాజా ఘటనపై స్థానిక స్వచ్ఛంద సంస్థలు (NGO) స్పందిస్తూ.. ఇలా ఎడారి దాటేటప్పుడు జరిగే ప్రమాదాల గురించి డ్రైవర్లకు, ప్రయాణికులకు ఎన్నో ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నామని, అయినప్పటికీ లిబియా, అల్జీరియా వైపు వెళ్లే రూట్లలో ఇలాంటి విషాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. కేవలం బతుకుదెరువు కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసం యువత ఇలాంటి అస్థిరమైన, ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుని బలికావాల్సి రావడం వారి దుస్థితికి అద్దం పడుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!