Microsoft: ‘‘మీకెంత ధైర్యం?’’.. మైక్రోసాఫ్ట్ బాస్లపై భారత సంతతి టెక్కీ ఆగ్రహం.. కారణం ఇదే..
- ఇజ్రాయిల్-గాజా యుద్ధంపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రచ్చ..
- మైక్రోసాఫ్ట్ బాస్ల ముందే ఆగ్రహం..
- పాలస్తీనా ప్రజల్ని చంపేందుకు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft: మైక్రోసాఫ్ట్ బాస్లపై భారత సంతతికి చెందిన ఒక ఇంజనీర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గాజాలో మారణహోమానికి ఇజ్రాయిల్కి సాంకేతిక సహాయం చేశారని వానియా అగర్వాల్ అనే టెక్కీ ప్రశ్నించింది. ఇజ్రాయిల్ సైనిక చర్యలలో మైక్రోసాఫ్ట్ భాగస్వామి అని ఆమె ఆరోపించింది. మైక్రోసాఫ్ట్ బాస్లు సత్య నాదెళ్ల, స్టీవ్ బాల్మెర్, బిల్ గేట్స్ ముగ్గురూ ఉన్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి ఆగ్రహంలో వీరంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సం సమయంలో వానియా వీరిని తీవ్రంగా విమర్శించింది.
‘‘గాజాలో 50,000 మంది పాలస్తీనియన్లు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీతో హత్యకు గురయ్యారు. మీకు ఎంత ధైర్యం..? వారి రక్తంతో వేడుకలు జరుపుకుంటున్నందుకు మీకు సిగ్గు ఉండాలి’’ అని కోపం వ్యక్తం చేసింది. నేను మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని, దీనికి నేను అంగీకరించను, 50,000 మంది పాలస్తీనియన్లు చంపబడ్డారని చెప్పింది. మైక్రోసాఫ్ట్ ‘‘డిజిటల్ ఆయుధాల తయారీదారు’’ అని పిలుస్తూనే, కంపెనీ తన టెక్నాలజీ ద్వారా హింసను ప్రారంభిస్తోందని ఆరోపించింది.
Also Read
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
Read Also: MI vs RCB: ఆర్సీబీపై బుమ్రాకు అద్భుత రికార్డు.. ఆ ప్రదర్శన ఎవరూ మరవలేనిది!
మరొక మహిళ ఆమెను హాలు నుంచి బయటకు తీసుకెళ్లే ముందు, ఇజ్రాయిల్తో సంబంధాలు తెంచుకోవాలని కోరింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖతో $133 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసినందుకు, పాలస్తీనియన్లపై సైనిక చర్యలలో దాని AI, అజూర్ టెక్నాలజీని వాడినందుకు మైక్రోసాఫ్ట్పై వానియా అగర్వాల్ తీవ్రంగా విమర్శించింది. ఆ తర్వాత తన రాజీనామాను ప్రకటించింది. మానవ హక్కుల ఉల్లంఘన ఉన్నందు వల్ల సహోద్యోగులు కూడా నిరసన తెలపాలని పిలుపునిచ్చింది.
తన రాజీనామా లేఖలో.. ‘‘నేను మంచి మనస్సాక్షితో, ఒక కంపెనీలో భాగం కాలేను. మీరు మైక్రోసాఫ్ట్లో పని చేయడం కొనసాగించాల్సి వస్తే, మీ స్థానం, అధికారం, ప్రత్యేక హక్కును ఉపయోగించి మైక్రోసాఫ్ట్ను దాని స్వంత విలువలు, లక్ష్యానికి జవాబుదారీగా ఉంచాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అని పేర్కొంది. వానియా అగర్వాల్ మరో ఉద్యోగి ఇబ్తిహాల్ అబౌసాద్, కంపెనీ AI CEO ముస్తఫా సులేమాన్ చేసిన ప్రెజెంటేషన్ను అడ్డుకుని, అతన్ని “యుద్ధ లాభదాయకుడు” అని ఆరోపించింది. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని జాతి వినాశక చర్యలకు ఉపయోగిస్తుందని చెప్పింది.
గతంలో కూడా, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇజ్రాయెల్తో ఉన్న సంబంధాలపై కంపెనీని విమర్శించారు, ఇది హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం చెడిపోయిన తర్వాత గాజాలో ఇజ్రాయిల్ మరోసారి హింసను ప్రారంభించింది. ఫిబ్రవరిలో, కాంట్రాక్టులను నిరసిస్తున్నందుకు సత్య నాదెల్లాతో జరిగిన సమావేశం నుండి ఐదుగురు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించారు.
https://twitter.com/SayfAlqudss/status/1908894193159754213
తాజావార్తలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!