Heatwave In Europe: ఎండల తీవ్రతకు అల్లాడుతున్న యూరప్ దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎండ తీవ్రతతో యూరప్ దేశాలు అల్లాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. యూరప్ దేశాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొటున్నాయి. ఎంతలా ఉంటే ఎండల తీవ్రతకు ట్రాఫిక్ సిగ్నళ్లు కరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల వల్ల ఎయిర్ పోర్టుల్లోని రన్ వేలపై తారు చిక్కగా మారుతోంది. దీంతో విమానాల ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇదిలా ఉంటే యూకేలో ఎండల కారణంగా రైళ్లను నిలిపివేశారు. దీంతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కార్చిచ్చు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే మొదటిసారిగా అత్యవసర పరిస్థితుల్లో పని చేస్తున్నామని అక్కడి ఫైర్ సర్వీస్ సిబ్బంది వెల్లడిస్తోందంటే.. అక్కడ ఉష్ణోగ్రతలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ వ్యాప్తంగా జనాలు ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Red Also: MP K Laxman: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చరిత్రాత్మకం
Also Read
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
యూకేలో ఎండల వల్ల ప్రయాణాలు, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాల్లింది. స్కూళ్లను మూసేశారు. రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేస్తున్నారు. బుధవారం లండన్ హీత్రూ విమానాశ్రయంలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. 2019లో నమోదైన 38.7 డిగ్రీల రికార్డును బద్ధలు కొట్టింది. లండన్ పరిసరాల్లో ఉన్న గడ్డి భూముల్లో మంటలు సంభవిస్తున్నాయి. ఇక మరో యూరప్ దేశం స్పెయిన్ దేశంలో వడగాలుల కారణంగా వారంలో 679 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్రాన్స్ లో 6500 హెక్టార్ల అడవులు కాలిపోయాయి. దాదాపుగా 30 వేల మంది ఇళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. డెన్మార్క్ దేశంవలోొ రికార్డు స్థాయిలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 1975లో చివరిసారిగా ఆ దేశంలో 36.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక జర్మనీలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. ప్రస్తుతం నమోదు అవుతున్న భారీ ఉష్ణోగ్రతలు పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అక్కడి రైతు సంఘం అధ్యక్షుడు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!