Iran: డ్రగ్ రిహాబ్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. 32 మంది దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ దేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ప్రాంతంలోని ఓ డ్రగ్ రిహాబ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 32 మంది మరణించారు. ఉత్తర గిలాన్ ప్రావిన్స్లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 27 నుంచి 32కి పెరిగినట్లు ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు.
Read Also: Pakistan: పోలీసులు లక్ష్యంగా పాక్లో బాంబుదాడి.. ఐదుగురు మృతి..
Also Read
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
ఈ ప్రమాదంలో మరో 16 మంది గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ కేంద్రం మొత్తం సామర్థ్యం 40 మందిగా తెలిసింది. సెంటర్ మేనేజర్ తో పాటు పలువురు అనుమానితులను ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
ఘటన జరిగిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల ధాటికి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. కిటికీలు పగిలిపోయాయి. ఈ ఘటనకు ముందు ఆగస్టు నెలలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని గ్రాండ్ బజార్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడి దుకాణాలు దెబ్బతిన్నాయి. ఎటువంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. జనవరి 2017లో, టెహ్రాన్లోని 15-అంతస్తుల ప్లాస్కో షాపింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది అగ్నిమాపక సిబ్బందితో సహా కనీసం 22 మంది మరణించారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!