Pakistan: పోలీసులు లక్ష్యంగా పాక్లో బాంబుదాడి.. ఐదుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: బాంబు పేలుళ్లతో మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ దద్దరిల్లింది. శుక్రవారం పాక్ వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో పేలుడు జరిగింది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. నగరంలోని పోలీస్ పెట్రోలింగ్ రూట్కి సమీపంలో బాంబు పేలిందని పోలీస్ అధికారి మహ్మద్ అద్నాన్ తెలిపారు.
అయితే ఈ పేలుడు ఆత్మాహుతి దాడి వల్ల జరిగిందా..? బాంబు అమర్చారా..? అనేది ఇంకా తేలలేదు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు. ప్రస్తుతం దాడి జరిగిన నగరం పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి సమీపంలో పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో ఉంది. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతం ఇస్లామిక్ తీవ్రవాదులకు, పాక్ తాలిబాన్లకు ప్రధాన కేంద్రంగా ఉంది.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
Read Also: Uttar Pradesh: పార్టీకి స్నేక్ వైన్ సరఫరా.. డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్..
పాకిస్తాన్ ఇటీవల కాలంలో బాంబు దాడులతో సతమతమవుతోంది. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాల్లో తరుచుగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పాక్ ఆర్మీ, చైనా ఇంజనీర్లే టార్గెట్గా దాడులు చేస్తోంది. ఇక వాయువ్య ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్లకు పట్టు ఉంది.
మరోవైపు పాకిస్తాన్ బాంబు పేలుళ్లు, ఉగ్రవాద ఘటనల్లో ఆఫ్ఘన్ వాసుల ప్రమేయం ఉందని చెబుతూ, పాక్ లోని తాత్కాలిక ప్రభుత్వం వలసదారులు ముఖ్యంగా ఆఫ్ఘన్ జాతీయులను దేశం వదలి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పేలుడు సంభవించింది. ఇప్పటికే లక్షలాది మంది ఆఫ్ఘాన్లు, పాక్ వదిలి సొంతదేశాలకు వెళ్లారు.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..