China: టీఆర్ఎఫ్ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై చైనా సంచలన ప్రకటన
- టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
- అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్లో మారణహోమానికి తెగబడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ను అగ్ర రాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయిబాకు ముసుగు సంస్థగా టీఆర్ఎఫ్ పని చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది.
ఇది కూడా చదవండి: Pakistan: భారత విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
Also Read
తాజాగా చైనా కూడా అమెరికా నిర్ణయానికి మద్దతు పలికింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. ఇక పహల్గామ్ ఉగ్ర దాడిని చైనా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని అన్ని దేశాలను కోరుతున్నట్లు తెలిపింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలని పొరుగు దేశాలను చైనా కోరుతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Sreeleela : బాలీవుడ్లో మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..
ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలీకృతం అయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్కు చైనా సంఘీభావం తెలిపినట్లు కనిపిస్తోంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పాకిస్థాన్పై భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. మే 7న పాకిస్థాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అలాగే పాకిస్థాన్ స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మొత్తానికి ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ప్రస్తుతం రెండు దేశాల ప్రశాంత వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు ఎక్కువ చెల్లించి 100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!