Bilawal Bhutto: మసూద్ అజార్ ఆచూకీ తెలియదు.. భారత్ సమాచారమిస్తే పట్టుకుంటాం
- మసూద్ అజార్ ఆచూకీ తెలియదు
- భారత్ సమాచారమిస్తే పట్టుకుంటాం
- బిలావల్ భుట్టో జర్దారీ వింత వ్యాఖ్యలు
భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన జైష్-ఎ-మహమ్మద్ సంస్థ నేత మసూద్ అజార్ ఎక్కడున్నాడో తమకు తెలియదని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధిపతి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్ సమాచారం ఇస్తే పట్టుకుంటామని వింతగా వ్యాఖ్యానించారు. బహుశా ఆప్ఘనిస్థాన్లో ఉండొచ్చేమోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ భాగంగా ఉంది.
ఇది కూడా చదవండి: Gold Rates: బంగారం ధరల్లో స్వల్ప మార్పులు.. నేడు తులం ఎంతంటే?
Also Read
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
- Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్తో భారత్ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..
- US Sailor Attacked by Monkey: హార్మూజ్ మిషన్కు బయలుదేరిన అమెరికా సైనికుడిపై కోతి దాడి.. మందుపాతరల తొలగింపులో వింత ఘటన
ఇక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు. పాక్ కస్టడీలో ఉన్నాడని చెప్పారు. ఇక మసూద్ అజార్ విషయానికొస్తే అతడు ఎక్కుడున్నాడో తమకు తెలియదన్నారు. బహుశా అతడు అప్ఘనిస్థాన్లో ఉండి ఉంటాడని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ పాక్ గడ్డ పైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం మాకు కచ్చితమైన సమాచారం ఇస్తే.. సంతోషంగా అతడిని అరెస్టు చేస్తామని.. కానీ న్యూడిల్లీ మాత్రం ఆ వివరాలు ఇవ్వదంటూ భుట్టో ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. గోడను ఢీకొట్టిన కారు.. వరుడు సహా 8 మంది మృతి
మసూద్ అజార్.. భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి దాడుల్లో సూత్రదారుడు. 2019లో ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించబడ్డాడు. 1999లో కాందహార్ హైజాక్ తర్వాత IC-814 ప్రయాణీకులకు బదులుగా అజార్ విడుదలయ్యాడు.
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లను అప్పగించాలని పాకిస్థాన్ను భారతదేశం డిమాండ్ చేస్తోంది. పాకిస్థాన్ దగ్గర ఆధారాలు ఉన్నగానీ.. ఏమీ తెలియనట్టు నాటకాలు ప్రదర్శిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!