Bangladesh Protests: బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. గాయపడిన 2500మంది..!
- బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లు..
- విద్యార్థులు.. నిరుద్యోగుల ఆందోళనలతో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు..
- ఈ అల్లర్లలో 105 మంది మృతి.. 2500 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Protests: రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతుంది. స్టూడెంట్స్, నిరుద్యోగుల ఆందోళనలతో బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా సర్కార్ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. విద్యార్థుల ఆందోళనలను అదుపు చేయడంలో పోలీసులు ఫెయిల్ కావడంతో రంగంలోకి మిలటరీని దించింది. కాగా, ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో 105 మంది చనిపోగా.. దాదాపు 2500 మంది గాయపడ్డారు. ఒక్క రాజధానిలో 52 మంది మృతి చెందాగా.. ఎక్కువ మరణాలకు పోలీసుల కాల్పులే కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
Read Also: Poha Health Benefits: అటుకులు తినడం వల్ల ఇన్ని లాభాలా..
Also Read
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
- F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ఇక, దేశ రాజధాని ఢాకాలో ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రజలు గుమికూడొద్దన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ సందర్భంగా ఇంటర్నెట్ను ఆపేసింది. ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని స్టూడెంట్స్ వెల్లడించారు. ఈ అల్లర్లలో చోటు చేసుకున్న మరణాలకు ప్రధాన మంత్రి షేక్ హసీనానే కారణం.. వెంటనే ఆమె తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు నర్సింగ్డి జిల్లాలో నిరసనకారులు జైలులోకి దూసుకెళ్లి ఖైదీలను రిలీజ్ చేశారు. ఆ తర్వాత జైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో జైలు నుంచి వందలాది మంది ఖైదీలు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. స్టూడెంట్స్ ఆందోళనకారులపై దాడులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.. ఇది ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు.
Read Also: Telangana: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు
కాగా, స్వతంత్ర దేశం కోసం పాకిస్థాన్తో 1971లో జరిగిన విముక్తి పోరులో పాల్గొన్న వారి పిల్లలు సహా కొన్ని నిర్దిష్ఠ సమూహాలకు సగానికిపైగా సివిల్ సర్వీస్ పోస్టుల్లో రిజర్వ్ చేసిన కోటా వ్యవస్థకు స్వస్తి పలకాలంటూ ఈ నెలలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రధాన మంత్రి హసీనాకు సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారన్న పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి.
BREAKING: Bangladesh has imposed a CURFEW and has deployed the ARMY to control ongoing protests against PM Hasina's authoritarian rule.
The death toll since Monday has climbed to at least 105.
Stay tuned.
pic.twitter.com/goHdtwAtcn— Steve Hanke (@steve_hanke) July 19, 2024
తాజావార్తలు
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..