Bangladesh: మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రేపు సెలవు దినం రద్దు
- బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం
- ఆగస్టు 15న సెలవు దినం రద్దు
- షేక్ ముజిబుర్ రెహమాన్ మృతిని గుర్తు చేసుకుంటూ సంతాప దినం
- షేక్ హసీనా తండ్రినే షేక్ ముజిబుర్ రెహమాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న దేశ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ మరణాన్ని పురస్కరించుకుని ఇచ్చే సెలవు దినాన్ని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో షేక్ హసీనాకు, ఆమె మద్దతుదారులకు గట్టి షాక్ తగిలినట్లైంది. 1975లో రెహమాన్ హత్యకు గురైనందున దేశం ఆగస్టు 15న ‘జాతీయ సంతాప దినం’గా పాటిస్తుంది. అయితే ఈ సెలవు దినాన్ని రద్దు చేస్తూ యూనస్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు వచ్చేసిన తర్వాత నిరసనకారులు రెహమాన్కు సంబంధించిన అనేక విగ్రహాలను ధ్వంసం చేశారు. షేక్ హసీనా తండ్రినే షేక్ ముజిబుర్ రెహమాన్.
ఇది కూడా చదవండి: Anna Canteens: రేపే ఏపీ వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం..
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ఇదిలా ఉంటే ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా జరుపుకోవాలని షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా మంగళవారం తన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగేలా ప్రార్థన చేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో నివాసం ఉంటున్న తన కుమారుడి ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలకు ఆమె సందేశం పంపించారు. కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆగస్టు 15న సంతాప దినాన్నే రద్దు చేసింది. దీంతో హసీనాకు గట్టి షాక్ ఇచ్చినట్లే అయింది.
ఇది కూడా చదవండి: Karnataka: మైనర్ను లాడ్జికి తీసుకెళ్లి యువకుడు లైంగికదాడి.. సోషల్ మీడియాలో వీడియో
కోటా ఉద్యమం తీవ్ర రక్తపాతం సృష్టించింది. అల్లర్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్కు వచ్చేశారు. అనంతరం ఆమె యూకేకు వెళ్లాలని ప్రయత్నం చేశారు.. కానీ అందుకు సాధ్యపడలేదు. దీంతో ఆమె ప్రస్తుతం ఢిల్లీలోనే బస చేస్తున్నారు. ఇదిలా ఉంటే నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇక హసీనా క్రిమినల్ కేసు కూడా నమోదైంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఒకరినొకరు చెప్పుతో కొట్టుకున్న టీచర్స్.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!