Bangladesh: మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రేపు సెలవు దినం రద్దు
- బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం
- ఆగస్టు 15న సెలవు దినం రద్దు
- షేక్ ముజిబుర్ రెహమాన్ మృతిని గుర్తు చేసుకుంటూ సంతాప దినం
- షేక్ హసీనా తండ్రినే షేక్ ముజిబుర్ రెహమాన్
బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న దేశ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ మరణాన్ని పురస్కరించుకుని ఇచ్చే సెలవు దినాన్ని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో షేక్ హసీనాకు, ఆమె మద్దతుదారులకు గట్టి షాక్ తగిలినట్లైంది. 1975లో రెహమాన్ హత్యకు గురైనందున దేశం ఆగస్టు 15న ‘జాతీయ సంతాప దినం’గా పాటిస్తుంది. అయితే ఈ సెలవు దినాన్ని రద్దు చేస్తూ యూనస్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు వచ్చేసిన తర్వాత నిరసనకారులు రెహమాన్కు సంబంధించిన అనేక విగ్రహాలను ధ్వంసం చేశారు. షేక్ హసీనా తండ్రినే షేక్ ముజిబుర్ రెహమాన్.
ఇది కూడా చదవండి: Anna Canteens: రేపే ఏపీ వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం..
Also Read
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
ఇదిలా ఉంటే ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా జరుపుకోవాలని షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా మంగళవారం తన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగేలా ప్రార్థన చేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో నివాసం ఉంటున్న తన కుమారుడి ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలకు ఆమె సందేశం పంపించారు. కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆగస్టు 15న సంతాప దినాన్నే రద్దు చేసింది. దీంతో హసీనాకు గట్టి షాక్ ఇచ్చినట్లే అయింది.
ఇది కూడా చదవండి: Karnataka: మైనర్ను లాడ్జికి తీసుకెళ్లి యువకుడు లైంగికదాడి.. సోషల్ మీడియాలో వీడియో
కోటా ఉద్యమం తీవ్ర రక్తపాతం సృష్టించింది. అల్లర్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్కు వచ్చేశారు. అనంతరం ఆమె యూకేకు వెళ్లాలని ప్రయత్నం చేశారు.. కానీ అందుకు సాధ్యపడలేదు. దీంతో ఆమె ప్రస్తుతం ఢిల్లీలోనే బస చేస్తున్నారు. ఇదిలా ఉంటే నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇక హసీనా క్రిమినల్ కేసు కూడా నమోదైంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఒకరినొకరు చెప్పుతో కొట్టుకున్న టీచర్స్.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!