Earthquake: ఆఫ్ఘానిస్తాన్ లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.40 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమి నుంచి 136 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది. అంతకుముందు మార్చి 2న ఆఫ్ఘనిస్తాన్ ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 245 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయింది.
Read Also: Off The Record: ప్రకాష్రాజ్ ఏమైపోయారు..? ఎన్నికల్లో పోటీ చేస్తారా?
అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఆఫ్ఘన్ కూడా ఉంది. ఇక్కడి హిందూకుష్ పర్వత శ్రేణుల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భారత్ తో పాటు ఆఫ్ఘన్ కూడా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ లో ఉంది. ఈ ప్రాంతం ఉత్తరం వైపు కదులుతూ.. యూరేషియా టెక్టానిక్ ప్లేట్ ను నెట్టేస్తోంది. దీని ప్రభావంతో అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల టర్కీ ప్రాంతంలో కూడా ఇలాంటి టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీ వల్లే భారీ భూకంపాలు సంభవించాయి. టర్కీ అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్ లో ఉంది. ఇది అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ తో ఢీకొట్టడం వల్లనే 7.8,7.5 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు వచ్చాయి.