Shocking: పోలీస్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో, ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం..
- పూణేలో దారుణం..
- ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం..
- పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలోనే ఘటన..
- మహారాష్ట్ర సర్కార్పై ప్రతిపక్షాల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: పూణేలో దారుణం చోటు చేసుకుంది. రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో, పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం జరగడం సంచలనంగా మారింది. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్గా గుర్తించారు. పోలీస్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో, నిలిచి ఉన్న బస్సులో మంగళవారం 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడిని గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు 8 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. స్నిఫర్ డాగ్స్ని రంగంలోకి దించారు. నిందితుడు 36 ఏళ్ల రాందాస్కి గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Agra: భార్య అశ్లీల ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసి.. పోర్న్ సైట్లో అప్లోడ్ చేసిన భర్త..
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
సతారా జిల్లాలోని ఫల్తాన్ అనే గ్రామానికి చెందిన మహిళ, పనిమనిషిగా పనిచేస్తుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నేరం ఉదయం 5.45 నుంచి 6.30 గంటల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలో మహిళతో ముందుగా నిందితుడు మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆమె గమ్యస్థానాన్ని తెలుసుకున్న నిందితుడు, ఆగి ఉన్న బస్సు వెళ్తుందని అందులోకి వెళ్లాలని సూచించినట్లు బాధితురాలు తెలిపింది. లైట్లు లేకపోవడంతో సందేహించానని, అయితే ప్రయాణికులు నిద్ర పోతుండటంతో లైట్లు ఆర్పేశానని నిందితుడు చెప్పాడని ఆమె తెలిపింది. బస్సులోకి వెళ్లగానే, నిందితుడు డోర్లు మూసేసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది.
జరిగిన విషయాన్ని, తన స్నేహితురాలికి తెలపడంతో పోలీసుల ఫిర్యాదు చేశారు. ఈ బస్ స్టాండ్ మహారాష్ట్ర ఆర్టీసీ నడిపే అతిపెద్ద బస్ స్టాండ్లలో ఒకటి. దీనిపై ప్రతిపక్షాలు ఫడ్నవీస్ సర్కార్పై ఫైర్ అవుతున్నాయి. సీఎంతో పాటు హోంమంత్రిత్వ శాఖను ఫడ్నవీస్ కలిగి ఉన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగాయని, తాజాగా ఘటన 2012 ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తుకు తెస్తోందని విమర్శించారు. నేరాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫమైందని ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఆరోపించారు.
తాజావార్తలు
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!