Crime: పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త స్నేహితుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్..
- మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన
- పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త ప్రియుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్
- మధ్యప్రదేశ్ లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజ్గఢ్ జిల్లాలోని బియోరాలో ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి ఎస్ఐని కారుతో ఢికొట్టి చంపేసింది. ఈ కేసు తర్వాత మహిళా కానిస్టేబుల్తో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపార్ట్మెంట్లో భాగంగా ఎస్ఐ దీపాంకర్ లేడీ కానిస్టేబుల్ పల్లవి సోలంకితో మాట్లాడేవాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆమె ప్రియుడు కరణ్ సింగ్కు అనుమానం వచ్చింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ తన ఇంట్లో ఉండగా… కుట్రలో భాగంగా భోపాల్ బైపాస్ వైపు రావాలని కరణ్, పల్లవి పిలిచారు. కరణ్, అతి వేగంతో కారు నడుపుతూ.. దీపాంకర్ బైక్ ను ఢీకొట్టాడు. తర్వాత అతన్ని చాలా దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ సమయంలో ఎస్ఐ దీపాంకర్ గౌతమ్ మృతి చెందాడు. దీని తరువాత, పోలీసులు మహిళా కానిస్టేబుల్, ప్రియుడిపై సెక్షన్ 103 (1), 3 (5) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు.
READ MORE: Telangana: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
బియోరా-దేవాస్ హైవేపై దేహత్ పోలీస్ స్టేషన్ వైపు బైక్పై వెళ్తున్న దీపాంకర్ను కారుతో ఢీకొట్టారని పోలీసులు తెలిపారు. దీపాంకర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. 30 మీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లారు. దీంతో దీపాంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం అక్కడే ఉన్న వ్యక్తులు ఎస్ఐని అంబులెన్స్లో సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కారు నంబర్ను గుర్తించిన పోలీసులు నిందితులు పల్లవి, కరణ్ అని తేలింది. పోలీసులు రెండు పోలీస్ స్టేషన్లకు పిలిపించి అర్థరాత్రి వరకు విచారించారు. నిందితులిద్దరూ ఎస్ఐని హత్య చేసినట్లుగా అంగీకరించినట్లు దేహత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గోవింద్ మీనా తెలిపారు. తన ప్రేమ మధ్య ఎస్ఐ వస్తున్నాడని చెప్పాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
READ MORE: Sanjauli Mosque Row: సిమ్లాలో వివాదంగా ‘సంజౌలి మసీదు’.. ప్రజలపై లాఠీఛార్జ్..
కాగా.. మహిళా కానిస్టేబుల్ పల్లవి, కరణ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. కొద్దిరోజుల క్రితం పరస్పరం గొడవల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ సమయంలో పల్లవి దీపాంకర్తో స్నేహం చేసింది. ఈ విషయం తెలుసుకున్న కరణ్ తిరిగి పల్లవి దగ్గరకు వెళ్లాడు. ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఎస్ఐ దీపాంకర్ను దారి నుంచి తప్పించాలని ఇద్దరూ ఆలోచించారు. మంగళవారం దీపంకర్ను కలవాలని పల్లవి పిలిచి కారుతో ఢీకొట్టి చంపేశారు.
తాజావార్తలు
-
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
-
Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
-
TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Kannappa: యూట్యూబ్లో విష్ణు మంచు ‘కన్నప్ప’
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..