Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని క్యాప్జెమిని టెక్నాలజీ పార్క్ క్యాంపస్ లోపల ఉన్న డేకేర్ సెంటర్లో చిన్న పిల్లలపై జరిగిన వేధింపుల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ అమానుషాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన విజిల్బ్లోయర్ (మహిళా ఉద్యోగిని)ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది..?
సదరు మహిళ డేకేర్ సెంటర్లో జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన సున్నితమైన వీడియోలను లీక్ చేసి, సర్క్యులేట్ చేసిందనే ఆరోపణలపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అంతకుముందు రోజు ఆమెను విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకెళ్లగా, పోలీసులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని.. ఆమెను సుదీర్ఘకాలం కస్టడీలో ఉంచడం వెనుక ఉన్న ఉద్దేశాలపై ఆమె కుటుంబ సభ్యులు, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
ఆ మహిళ షేర్ చేసిన వీడియోలు అత్యంత భయానకంగా ఉన్నాయి. కేవలం రెండేళ్ల వయసున్న పసిపిల్లలను ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ డ్రమ్ లోపల కూర్చోబెట్టి, కేర్టేకర్లు వారిపై వాటర్ జెట్ స్ప్రేతో నీళ్లు చల్లడం కనిపించింది. చిన్న పిల్లలను క్రూరంగా బాత్రూమ్లలో వేసి తాళాలు పెట్టడం వంటి దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ దారుణాన్ని బయటపెట్టిన కొద్దిసేపటికే డేకేర్ యాజమాన్యం ఆ విజిల్బ్లోయర్ను ఉద్యోగం నుండి తొలగించింది. పోలీసులు ఈ కేసులో విజయలక్ష్మి, మంజుల అనే ఇద్దరు మహిళా కేర్టేకర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ క్యాప్జెమిని ఈ ఘటనపై స్పందిస్తూ, తమ ఉద్యోగుల, వారి కుటుంబాల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. అధికారుల దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని పేర్కొంటూ, ప్రస్తుతం ఆ క్యాంపస్ లోని డేకేర్ సదుపాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది.
ఈ డేకేర్లో సుమారు 50 నుంచి 60 మంది పిల్లలు నమోదు చేసుకోగా, నిత్యం 15 నుంచి 20 మంది పిల్లలు వచ్చేవారు. ఐటీ ఉద్యోగులు తమ పిల్లలను నమ్మి వదిలివెళ్తే.. అక్కడ కేర్టేకర్లు వారిని వేధించారని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!