Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని క్యాప్జెమిని టెక్నాలజీ పార్క్ క్యాంపస్ లోపల ఉన్న డేకేర్ సెంటర్లో చిన్న పిల్లలపై జరిగిన వేధింపుల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయితే.. ఈ అమానుషాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన విజిల్బ్లోయర్ (మహిళా ఉద్యోగిని)ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది..?
సదరు మహిళ డేకేర్ సెంటర్లో జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన సున్నితమైన వీడియోలను లీక్ చేసి, సర్క్యులేట్ చేసిందనే ఆరోపణలపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అంతకుముందు రోజు ఆమెను విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకెళ్లగా, పోలీసులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని.. ఆమెను సుదీర్ఘకాలం కస్టడీలో ఉంచడం వెనుక ఉన్న ఉద్దేశాలపై ఆమె కుటుంబ సభ్యులు, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
- Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
ఆ మహిళ షేర్ చేసిన వీడియోలు అత్యంత భయానకంగా ఉన్నాయి. కేవలం రెండేళ్ల వయసున్న పసిపిల్లలను ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ డ్రమ్ లోపల కూర్చోబెట్టి, కేర్టేకర్లు వారిపై వాటర్ జెట్ స్ప్రేతో నీళ్లు చల్లడం కనిపించింది. చిన్న పిల్లలను క్రూరంగా బాత్రూమ్లలో వేసి తాళాలు పెట్టడం వంటి దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ దారుణాన్ని బయటపెట్టిన కొద్దిసేపటికే డేకేర్ యాజమాన్యం ఆ విజిల్బ్లోయర్ను ఉద్యోగం నుండి తొలగించింది. పోలీసులు ఈ కేసులో విజయలక్ష్మి, మంజుల అనే ఇద్దరు మహిళా కేర్టేకర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ క్యాప్జెమిని ఈ ఘటనపై స్పందిస్తూ, తమ ఉద్యోగుల, వారి కుటుంబాల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. అధికారుల దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని పేర్కొంటూ, ప్రస్తుతం ఆ క్యాంపస్ లోని డేకేర్ సదుపాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది.
ఈ డేకేర్లో సుమారు 50 నుంచి 60 మంది పిల్లలు నమోదు చేసుకోగా, నిత్యం 15 నుంచి 20 మంది పిల్లలు వచ్చేవారు. ఐటీ ఉద్యోగులు తమ పిల్లలను నమ్మి వదిలివెళ్తే.. అక్కడ కేర్టేకర్లు వారిని వేధించారని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!