Sanjauli Mosque Row: సిమ్లాలో వివాదంగా ‘సంజౌలి మసీదు’.. ప్రజలపై లాఠీఛార్జ్..
- హిమాచల్ ప్రదేశ్లో సంజౌలీ మసీదు మంటలు..
- అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని నిరసన..
- ఆందోళనకారులపై లాఠీచార్జ్.. వాటార్ క్యానన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjauli Mosque Row: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో సంజౌలి మసీదు వివాదం ముదురుతోంది. ఈ మసీదును అక్రమంగా నిర్మించారని చెబుతూ, స్థానిక ప్రజలు, హిందూ గ్రూపు, బీజేపీ తీవ్ర నిరసనలు చేస్తోంది. అయితే, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తోంది. ఈ వివాదం రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. చట్టవిరుద్ధమైన ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వందలాది మంది నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.
సబ్జీ మండి ఢల్లి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. నిరసన తెలిపేందుకు సంజౌలి మసీదు వైపు మార్చ్ చేశారు. వివాదాస్పద ప్రాంతం వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిరసనకారులు వీటిని బద్దలు కొట్టి ముందుకు వెళ్లారు. అయితే, మసీదు సమీపంలోని రెండో బారికేడ్ని బద్దలు కొట్టడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వాటర్ క్యానన్లను ప్రయోగించి వారిని చెదరగొట్టారు.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
Read Also: BJP: జార్ఖండ్లో బీజేపీ కీలక నిర్ణయం.. అభ్యర్థులను ఎన్నుకోనున్న కార్యకర్తలు
ఈ వివాదం పెద్దది కావడంతో మత ఉద్రిక్తతలు పెరగకుండా నగర వ్యాప్తంగా పోలీస్ బందోబస్తును పెంచారు. సిమ్లా జిల్లా యంత్రాంగం భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163ని విధించింది. ఐదుగురు కన్నా ఎక్కువ మంది సమావేశాన్ని నిర్వహించకుండా, మారణాయుధాలు తీసుకెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై బీజేపీ విరుచుకుపడుతోంది. మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ఈ మసీదు వివాదంపై ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలోని సొంత మంత్రి అనిరుద్ధ్ సింగ్ అసెంబ్లీలో నిలదీశారు. ఈ మసీదును అనధికారికంగా నిర్మించారని ఆరోపించారు. కూల్చివేయాలని కోరారు, మసీదు నిర్మాణం కోసం ఎక్కడ నుంచి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. లవ్ జిహాద్ కేసులతో పాటు మార్కెట్ ఏరియాలో మహిళలు నడవలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!