Sanjauli Mosque Row: సిమ్లాలో వివాదంగా ‘సంజౌలి మసీదు’.. ప్రజలపై లాఠీఛార్జ్..
- హిమాచల్ ప్రదేశ్లో సంజౌలీ మసీదు మంటలు..
- అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని నిరసన..
- ఆందోళనకారులపై లాఠీచార్జ్.. వాటార్ క్యానన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjauli Mosque Row: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో సంజౌలి మసీదు వివాదం ముదురుతోంది. ఈ మసీదును అక్రమంగా నిర్మించారని చెబుతూ, స్థానిక ప్రజలు, హిందూ గ్రూపు, బీజేపీ తీవ్ర నిరసనలు చేస్తోంది. అయితే, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తోంది. ఈ వివాదం రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. చట్టవిరుద్ధమైన ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వందలాది మంది నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.
సబ్జీ మండి ఢల్లి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. నిరసన తెలిపేందుకు సంజౌలి మసీదు వైపు మార్చ్ చేశారు. వివాదాస్పద ప్రాంతం వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిరసనకారులు వీటిని బద్దలు కొట్టి ముందుకు వెళ్లారు. అయితే, మసీదు సమీపంలోని రెండో బారికేడ్ని బద్దలు కొట్టడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వాటర్ క్యానన్లను ప్రయోగించి వారిని చెదరగొట్టారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: BJP: జార్ఖండ్లో బీజేపీ కీలక నిర్ణయం.. అభ్యర్థులను ఎన్నుకోనున్న కార్యకర్తలు
ఈ వివాదం పెద్దది కావడంతో మత ఉద్రిక్తతలు పెరగకుండా నగర వ్యాప్తంగా పోలీస్ బందోబస్తును పెంచారు. సిమ్లా జిల్లా యంత్రాంగం భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163ని విధించింది. ఐదుగురు కన్నా ఎక్కువ మంది సమావేశాన్ని నిర్వహించకుండా, మారణాయుధాలు తీసుకెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై బీజేపీ విరుచుకుపడుతోంది. మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ఈ మసీదు వివాదంపై ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలోని సొంత మంత్రి అనిరుద్ధ్ సింగ్ అసెంబ్లీలో నిలదీశారు. ఈ మసీదును అనధికారికంగా నిర్మించారని ఆరోపించారు. కూల్చివేయాలని కోరారు, మసీదు నిర్మాణం కోసం ఎక్కడ నుంచి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. లవ్ జిహాద్ కేసులతో పాటు మార్కెట్ ఏరియాలో మహిళలు నడవలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!