Sanjauli Mosque Row: సిమ్లాలో వివాదంగా ‘సంజౌలి మసీదు’.. ప్రజలపై లాఠీఛార్జ్..
- హిమాచల్ ప్రదేశ్లో సంజౌలీ మసీదు మంటలు..
- అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని నిరసన..
- ఆందోళనకారులపై లాఠీచార్జ్.. వాటార్ క్యానన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjauli Mosque Row: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో సంజౌలి మసీదు వివాదం ముదురుతోంది. ఈ మసీదును అక్రమంగా నిర్మించారని చెబుతూ, స్థానిక ప్రజలు, హిందూ గ్రూపు, బీజేపీ తీవ్ర నిరసనలు చేస్తోంది. అయితే, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తోంది. ఈ వివాదం రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. చట్టవిరుద్ధమైన ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వందలాది మంది నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.
సబ్జీ మండి ఢల్లి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. నిరసన తెలిపేందుకు సంజౌలి మసీదు వైపు మార్చ్ చేశారు. వివాదాస్పద ప్రాంతం వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిరసనకారులు వీటిని బద్దలు కొట్టి ముందుకు వెళ్లారు. అయితే, మసీదు సమీపంలోని రెండో బారికేడ్ని బద్దలు కొట్టడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వాటర్ క్యానన్లను ప్రయోగించి వారిని చెదరగొట్టారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: BJP: జార్ఖండ్లో బీజేపీ కీలక నిర్ణయం.. అభ్యర్థులను ఎన్నుకోనున్న కార్యకర్తలు
ఈ వివాదం పెద్దది కావడంతో మత ఉద్రిక్తతలు పెరగకుండా నగర వ్యాప్తంగా పోలీస్ బందోబస్తును పెంచారు. సిమ్లా జిల్లా యంత్రాంగం భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163ని విధించింది. ఐదుగురు కన్నా ఎక్కువ మంది సమావేశాన్ని నిర్వహించకుండా, మారణాయుధాలు తీసుకెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై బీజేపీ విరుచుకుపడుతోంది. మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
ఈ మసీదు వివాదంపై ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలోని సొంత మంత్రి అనిరుద్ధ్ సింగ్ అసెంబ్లీలో నిలదీశారు. ఈ మసీదును అనధికారికంగా నిర్మించారని ఆరోపించారు. కూల్చివేయాలని కోరారు, మసీదు నిర్మాణం కోసం ఎక్కడ నుంచి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. లవ్ జిహాద్ కేసులతో పాటు మార్కెట్ ఏరియాలో మహిళలు నడవలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!