Wife Planned to Kill Husband: భార్యామణి నిర్వాకం.. భర్త అడ్డు తొలగించే ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ సంబంధాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ సుఖం కోసం డబ్బుకోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడం లేదు. భార్య అడ్డు తొలగించుకోవడానికి భర్త, భర్తను చంపేందుకు భార్య కుటిల ప్లాన్ లు వేస్తున్నారు. నా భర్త మనకు అడ్డుగా వున్నాడు. అతడిని చంపేస్తే మనం హాయిగా బతక వచ్చని ఓ భార్యామణి ప్లానేసింది. గుర్తు తెలియకుండా చంపేసి నా దగ్గరికి రా.. ఇద్దరం కలిసి హాయిగా జీవిస్తాం.. అంటూ ప్రియుడికి ఒక భార్య నూరి పోసింది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైన ప్రియుడిని రెచ్చగొట్టి భర్తను చంపించింది. భర్తను చంపిన తర్వాత ఏమీ తెలియనట్టు నాటకలాడింది. ఈ వ్యవహారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో సంచలనం కలిగించింది.
వివాహేతర సంబంధాలు ఎలాంటి అకృత్యాలకైనా దారితీస్తాయి. ఓ పండ్ల వ్యాపారి హత్య కేసులోనూ ప్రధాన సూత్రధారి మృతుని అతని భార్య, ఆమె ప్రియుడేనని తేలింది. కామారెడ్డి జిల్లా మద్నూర్కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. పటాన్చెరు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్పల్లి మండలం టంగటూర్లో దానిమ్మ తోట లీజు తీసుకుని, అక్కడికి వారానికోసారి వచ్చి పోతున్నాడు. బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్ ట్రైనర్ తిరుపతిరావుతో పరిచయం కలిగింది.
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
Rahul Gandhi: మళ్లీ గబ్బర్సింగ్ స్ట్రైక్ అంటూ జీఎస్టీ రేట్ల పెంపుపై ఫైర్
భర్త దగ్గర లేకపోవడంతో అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త శంకరయ్య నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతణ్ని చంపేస్తే.. మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని తిరుపతిరావుకి చెప్పింది. ఇద్దరు కలిసి శంకరయ్య హత్యకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. శంకరయ్యను చంపేసి అది దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించాలని ప్లానేశారు. ఈనెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని వీడికి జయసుధ సమాచారం ఇచ్చింది. శంకరయ్య తోటని చూసుకుని తిరిగి వస్తుండగా టంగటూర్ గ్రామ శివారులో ప్రియుడు ఏకకాలంలో దాడికి పాల్పడ్డాడు.అతని తల మెడ భాగాన్ని కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోసేశాడు. పోలీసులు కూడా ఇది దోపిడీ దొంగల పనిగా భావించారు. కానీ ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసుని ఛేదించారు. నిందితుడు వాడిన ద్విచక్రవాహనం నంబర్ ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిరావు స్వస్థలం విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలం పంచాలి గ్రామంగా గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో చంపించినట్లు వెల్లడించారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
https://www.youtube.com/watch?v=2ehYDq5WDOo
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!