Wife Planned to Kill Husband: భార్యామణి నిర్వాకం.. భర్త అడ్డు తొలగించే ప్లాన్
మానవ సంబంధాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ సుఖం కోసం డబ్బుకోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడం లేదు. భార్య అడ్డు తొలగించుకోవడానికి భర్త, భర్తను చంపేందుకు భార్య కుటిల ప్లాన్ లు వేస్తున్నారు. నా భర్త మనకు అడ్డుగా వున్నాడు. అతడిని చంపేస్తే మనం హాయిగా బతక వచ్చని ఓ భార్యామణి ప్లానేసింది. గుర్తు తెలియకుండా చంపేసి నా దగ్గరికి రా.. ఇద్దరం కలిసి హాయిగా జీవిస్తాం.. అంటూ ప్రియుడికి ఒక భార్య నూరి పోసింది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైన ప్రియుడిని రెచ్చగొట్టి భర్తను చంపించింది. భర్తను చంపిన తర్వాత ఏమీ తెలియనట్టు నాటకలాడింది. ఈ వ్యవహారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో సంచలనం కలిగించింది.
వివాహేతర సంబంధాలు ఎలాంటి అకృత్యాలకైనా దారితీస్తాయి. ఓ పండ్ల వ్యాపారి హత్య కేసులోనూ ప్రధాన సూత్రధారి మృతుని అతని భార్య, ఆమె ప్రియుడేనని తేలింది. కామారెడ్డి జిల్లా మద్నూర్కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. పటాన్చెరు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్పల్లి మండలం టంగటూర్లో దానిమ్మ తోట లీజు తీసుకుని, అక్కడికి వారానికోసారి వచ్చి పోతున్నాడు. బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్ ట్రైనర్ తిరుపతిరావుతో పరిచయం కలిగింది.
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
Rahul Gandhi: మళ్లీ గబ్బర్సింగ్ స్ట్రైక్ అంటూ జీఎస్టీ రేట్ల పెంపుపై ఫైర్
భర్త దగ్గర లేకపోవడంతో అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త శంకరయ్య నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతణ్ని చంపేస్తే.. మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని తిరుపతిరావుకి చెప్పింది. ఇద్దరు కలిసి శంకరయ్య హత్యకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. శంకరయ్యను చంపేసి అది దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించాలని ప్లానేశారు. ఈనెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని వీడికి జయసుధ సమాచారం ఇచ్చింది. శంకరయ్య తోటని చూసుకుని తిరిగి వస్తుండగా టంగటూర్ గ్రామ శివారులో ప్రియుడు ఏకకాలంలో దాడికి పాల్పడ్డాడు.అతని తల మెడ భాగాన్ని కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోసేశాడు. పోలీసులు కూడా ఇది దోపిడీ దొంగల పనిగా భావించారు. కానీ ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసుని ఛేదించారు. నిందితుడు వాడిన ద్విచక్రవాహనం నంబర్ ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిరావు స్వస్థలం విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలం పంచాలి గ్రామంగా గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో చంపించినట్లు వెల్లడించారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
https://www.youtube.com/watch?v=2ehYDq5WDOo
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో