Wife Planned to Kill Husband: భార్యామణి నిర్వాకం.. భర్త అడ్డు తొలగించే ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ సంబంధాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ సుఖం కోసం డబ్బుకోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడం లేదు. భార్య అడ్డు తొలగించుకోవడానికి భర్త, భర్తను చంపేందుకు భార్య కుటిల ప్లాన్ లు వేస్తున్నారు. నా భర్త మనకు అడ్డుగా వున్నాడు. అతడిని చంపేస్తే మనం హాయిగా బతక వచ్చని ఓ భార్యామణి ప్లానేసింది. గుర్తు తెలియకుండా చంపేసి నా దగ్గరికి రా.. ఇద్దరం కలిసి హాయిగా జీవిస్తాం.. అంటూ ప్రియుడికి ఒక భార్య నూరి పోసింది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైన ప్రియుడిని రెచ్చగొట్టి భర్తను చంపించింది. భర్తను చంపిన తర్వాత ఏమీ తెలియనట్టు నాటకలాడింది. ఈ వ్యవహారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో సంచలనం కలిగించింది.
వివాహేతర సంబంధాలు ఎలాంటి అకృత్యాలకైనా దారితీస్తాయి. ఓ పండ్ల వ్యాపారి హత్య కేసులోనూ ప్రధాన సూత్రధారి మృతుని అతని భార్య, ఆమె ప్రియుడేనని తేలింది. కామారెడ్డి జిల్లా మద్నూర్కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. పటాన్చెరు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్పల్లి మండలం టంగటూర్లో దానిమ్మ తోట లీజు తీసుకుని, అక్కడికి వారానికోసారి వచ్చి పోతున్నాడు. బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్ ట్రైనర్ తిరుపతిరావుతో పరిచయం కలిగింది.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
Rahul Gandhi: మళ్లీ గబ్బర్సింగ్ స్ట్రైక్ అంటూ జీఎస్టీ రేట్ల పెంపుపై ఫైర్
భర్త దగ్గర లేకపోవడంతో అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త శంకరయ్య నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతణ్ని చంపేస్తే.. మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని తిరుపతిరావుకి చెప్పింది. ఇద్దరు కలిసి శంకరయ్య హత్యకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. శంకరయ్యను చంపేసి అది దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించాలని ప్లానేశారు. ఈనెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని వీడికి జయసుధ సమాచారం ఇచ్చింది. శంకరయ్య తోటని చూసుకుని తిరిగి వస్తుండగా టంగటూర్ గ్రామ శివారులో ప్రియుడు ఏకకాలంలో దాడికి పాల్పడ్డాడు.అతని తల మెడ భాగాన్ని కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోసేశాడు. పోలీసులు కూడా ఇది దోపిడీ దొంగల పనిగా భావించారు. కానీ ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసుని ఛేదించారు. నిందితుడు వాడిన ద్విచక్రవాహనం నంబర్ ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిరావు స్వస్థలం విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలం పంచాలి గ్రామంగా గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో చంపించినట్లు వెల్లడించారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
https://www.youtube.com/watch?v=2ehYDq5WDOo
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!