Dowry Harassment: ఎంత బాధ అనుభవించావు మనీషా.. కాళ్లు, కడుపుపై సూసైడ్ నోట్..
- కంటతడి పెట్టిస్తున్న మనీషా సూసైడ్ నోట్..
- కడుపు, కాళ్లు, చేతులపై నోట్ రాసి ఆత్మహత్య..
- భర్త, అత్తమామల వరకట్న దాహానికి బలైన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry Harassment: అత్తింటి వారి వరకట్న దాహానికి మరో అమ్మాయి బలైంది. ఈ వారం ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ బాగ్పత్లో అత్తమామాల నుంచి కట్నం వేధింపులు తట్టుకోలేక 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తాను అనుభవించిన బాధల్ని తన శరీరంపై సూసైడ్ నోట్గా రాసుకుంది. మంగళవారం రాత్రి మనీషా అనే మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త కుందన్, అతడి కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించింది.
మనీషా తన చేతులు, కాళ్లు, కడుపుపై పెన్నుతో సూసైడ్ నోట్ రాసింది. నా మరణానికి కుందన్, అతడి కుటుంబ సభ్యులే కారణమని పేర్కొంది. మనీషా తన అత్తమామ, భర్తను నిందిస్తూ ఓ వీడియో కూడా చేసింది. దీనిని పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో మనీషా ఏడుస్తూ.. తన భర్త, తండ్రి, అతడి సోదరుడు కట్నం కోసం తనను ఎలా వేధించారనే విషయాలను వెల్లడించింది.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
Read Also: Chhangur Baba: ఛంగూర్ బాబా “రెడ్ డైరీ”లో పొలిటీషియన్స్, పోలీసుల పేర్లు..
ఆమె కుటుంబం చెప్పిన దాని ప్రకారం, మనీషా వివాహానికి రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. కట్నం కింద బుల్లెట్ బైక్ ఇచ్చారు. అయితే, ఎప్పటికప్పుడు వారు పదే పదే కారు, భారీ మొత్తంలో నగదును డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. తన అత్తమామలు ఎప్పుడూ కొట్టేవారని, గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేసినట్లు మనీషా ఆరోపించింది. కట్నం కోసం వేధిస్తూ, విద్యుత్ షాక్తో చంపాలని ప్రయత్నించినట్లు చెప్పింది.
మనీషా 2023లో నోయిడాకు చెందిన కుందన్ అనే వ్యక్తితో వివాహం అయినట్లు అధికారులు తెలిపారు. వివాహం జరిగిన కొన్ని రోజుల ముందు నుంచే అత్తమామల వేధింపులు ప్రారంభమయ్యాయి. హింస పెరగడంతో, మనీషా జూలై 2024లో తన సొంతింటికి వెళ్లింది. ఆమె మరణానికి నాలుగు రోజుల ముందు, మనీషా కుటుంబం విడాకులు తీసుకోవడం గురించి చర్చించారు. ఆమె అత్తమామలు తాను ఇచ్చిన కట్నం తిరిగి ఇచ్చేంత వరకు విడాకుల పత్రాలపై సంతకం చేయనని చెప్పినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!