Chhangur Baba: ఛంగూర్ బాబా “రెడ్ డైరీ”లో పొలిటీషియన్స్, పోలీసుల పేర్లు..
- ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఛంగూర్ బాబా అరాచకాలు..
- ‘‘రెడ్ డైరీ’’పై ఈడీ, ఎన్ఐధ, యూపీ పోలీసుల దృష్టి..
- రెడ్ డైరీలో పొలిటీషియన్స్, పోలీసుల పేర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు లవ్ జిహాద్ కోసం ఛంగూర్ బాబా ముస్లిం యువకులకు లక్షల్లో డబ్బు ఇచ్చినట్లు విచారణలో తేలింది. మిడిల్ ఈస్ట్లోని అరబ్ దేశాల నుంచి వందల కోట్లలో డబ్బు రావడం చూస్తే, ఇది పెద్ద ఎత్తున దేశద్రోహ చర్యగా భావిస్తున్నారు. దీనిపై ఇప్పుడు9 యూపీ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఎన్ఐఏ,ఈడీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also: WCL 2025: జులై 20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్గా యువరాజ్ సింగ్!
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
ఏటీఎస్, స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఈడీ సంస్థలు ఇప్పుడు చంగూర్ బాబా ‘‘రెడ్ డైరీ’’పై దృష్టిసారించాయి. విదేశాల నుంచి రూ. 106 కోట్ల విదేశీ నిధులు కలిగి ఉన్నాయని తెలిసిన కొన్ని రోజుల తర్వాత ఈ రెడ్ బుక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్టీఎఫ్ దాడుల్లో ఛంగూర్ బాబా విలాసవంతమైన భవనంలో ఇది లభించింది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలు ఛంగూర్ బాబా నుంచి ఆర్థిక సాయం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో రాజకీయ నేతల పేర్లతో పాటు అధికారుల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా డైరీలో, ఆరుగురు కీలక నేతలు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం పొందినట్లు తెలుస్తోంది. వీరితో పాటు పోలీస్ అధికారుల పేర్లు కూడా ఈ బుక్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సైకిల్పై ఉంగరాళ్లు, రంగురాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి ఏకంగా వందల కోట్ల నిధులు సేకరించే స్థాయికి చేరాడు ఛంగూర్ బాబా. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉన్న బలరాంపూర్ జిల్లాలోని మాధ్పూర్ని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా హిందూ మహిళల్ని మతం మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జూలై 5న ఛంగూర్ బాబా, అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్లను లక్నోలో అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!