Chhangur Baba: ఛంగూర్ బాబా “రెడ్ డైరీ”లో పొలిటీషియన్స్, పోలీసుల పేర్లు..
- ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఛంగూర్ బాబా అరాచకాలు..
- ‘‘రెడ్ డైరీ’’పై ఈడీ, ఎన్ఐధ, యూపీ పోలీసుల దృష్టి..
- రెడ్ డైరీలో పొలిటీషియన్స్, పోలీసుల పేర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు లవ్ జిహాద్ కోసం ఛంగూర్ బాబా ముస్లిం యువకులకు లక్షల్లో డబ్బు ఇచ్చినట్లు విచారణలో తేలింది. మిడిల్ ఈస్ట్లోని అరబ్ దేశాల నుంచి వందల కోట్లలో డబ్బు రావడం చూస్తే, ఇది పెద్ద ఎత్తున దేశద్రోహ చర్యగా భావిస్తున్నారు. దీనిపై ఇప్పుడు9 యూపీ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఎన్ఐఏ,ఈడీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also: WCL 2025: జులై 20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్గా యువరాజ్ సింగ్!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
ఏటీఎస్, స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఈడీ సంస్థలు ఇప్పుడు చంగూర్ బాబా ‘‘రెడ్ డైరీ’’పై దృష్టిసారించాయి. విదేశాల నుంచి రూ. 106 కోట్ల విదేశీ నిధులు కలిగి ఉన్నాయని తెలిసిన కొన్ని రోజుల తర్వాత ఈ రెడ్ బుక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్టీఎఫ్ దాడుల్లో ఛంగూర్ బాబా విలాసవంతమైన భవనంలో ఇది లభించింది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలు ఛంగూర్ బాబా నుంచి ఆర్థిక సాయం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో రాజకీయ నేతల పేర్లతో పాటు అధికారుల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా డైరీలో, ఆరుగురు కీలక నేతలు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం పొందినట్లు తెలుస్తోంది. వీరితో పాటు పోలీస్ అధికారుల పేర్లు కూడా ఈ బుక్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సైకిల్పై ఉంగరాళ్లు, రంగురాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి ఏకంగా వందల కోట్ల నిధులు సేకరించే స్థాయికి చేరాడు ఛంగూర్ బాబా. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉన్న బలరాంపూర్ జిల్లాలోని మాధ్పూర్ని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా హిందూ మహిళల్ని మతం మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జూలై 5న ఛంగూర్ బాబా, అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్లను లక్నోలో అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!