Chhangur Baba: ఛంగూర్ బాబా “రెడ్ డైరీ”లో పొలిటీషియన్స్, పోలీసుల పేర్లు..
- ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఛంగూర్ బాబా అరాచకాలు..
- ‘‘రెడ్ డైరీ’’పై ఈడీ, ఎన్ఐధ, యూపీ పోలీసుల దృష్టి..
- రెడ్ డైరీలో పొలిటీషియన్స్, పోలీసుల పేర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు లవ్ జిహాద్ కోసం ఛంగూర్ బాబా ముస్లిం యువకులకు లక్షల్లో డబ్బు ఇచ్చినట్లు విచారణలో తేలింది. మిడిల్ ఈస్ట్లోని అరబ్ దేశాల నుంచి వందల కోట్లలో డబ్బు రావడం చూస్తే, ఇది పెద్ద ఎత్తున దేశద్రోహ చర్యగా భావిస్తున్నారు. దీనిపై ఇప్పుడు9 యూపీ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఎన్ఐఏ,ఈడీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also: WCL 2025: జులై 20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్గా యువరాజ్ సింగ్!
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
ఏటీఎస్, స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఈడీ సంస్థలు ఇప్పుడు చంగూర్ బాబా ‘‘రెడ్ డైరీ’’పై దృష్టిసారించాయి. విదేశాల నుంచి రూ. 106 కోట్ల విదేశీ నిధులు కలిగి ఉన్నాయని తెలిసిన కొన్ని రోజుల తర్వాత ఈ రెడ్ బుక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్టీఎఫ్ దాడుల్లో ఛంగూర్ బాబా విలాసవంతమైన భవనంలో ఇది లభించింది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలు ఛంగూర్ బాబా నుంచి ఆర్థిక సాయం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో రాజకీయ నేతల పేర్లతో పాటు అధికారుల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా డైరీలో, ఆరుగురు కీలక నేతలు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం పొందినట్లు తెలుస్తోంది. వీరితో పాటు పోలీస్ అధికారుల పేర్లు కూడా ఈ బుక్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సైకిల్పై ఉంగరాళ్లు, రంగురాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి ఏకంగా వందల కోట్ల నిధులు సేకరించే స్థాయికి చేరాడు ఛంగూర్ బాబా. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉన్న బలరాంపూర్ జిల్లాలోని మాధ్పూర్ని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా హిందూ మహిళల్ని మతం మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జూలై 5న ఛంగూర్ బాబా, అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్లను లక్నోలో అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!