Karnataka: ట్రిపుల్ మర్డర్.. భర్తను హత్య చేసిన ముగ్గురిని ప్రతిజ్ఞ చేసి మరీ చంపిన భార్య..
- కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురి దారుణ హత్య
- తన భర్తను చంపిన వాళ్లను చంపిన భర్య
- మారణాయుధాలతో దాడి చేసిన నిందితులు
- ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
READ MORE: Air India plane crash: ఎయిరిండియా ప్రమాద బాధితుల కోసం రూ. 500 కోట్లతో టాటా ట్రస్ట్..!
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
ఈ నేరానికి పాల్పడిన పట్టాన్ గ్రామ నివాసితులు నాగరాజ (23), ఇరన్న (27), భిర్ణ్య (21), సిద్ధినాద (22), నాగరాజ్ (17), పిరేష్ (35), సాగర్ (24), రచన్న్య అలియాస్ గిల్లి (22), చంద్రకాంత్ (30), భాగ్యశ్రీ (30) లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు హత్యకు గల కారణాలను వెల్లడించారు. వాస్తవానికి.. గత సంవత్సరం సోమనాథ్ తాలికోటి అనే యువకుడిని హత్య చేశారు. అప్పుడు సోమనాథ్ భార్య తన భర్త మృతదేహం ముందు హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు తన మంగళసూత్రాన్ని తీసివేయనని ప్రతిజ్ఞ చేసింది.
READ MORE: DRI: పాకిస్థాన్కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!
గత ఏడాది నవంబర్ 12న నిందితుల్లో ఒకరైన భాగ్యశ్రీ భర్త సోమనాథ్ తాలికోటి హత్యకు గురయ్యాడు. తాజాగా హత్యకు గురైన సిద్ధారుధ, అతని కుటుంబ సభ్యులు సోమనాథ్ను దారుణంగా హత్య చేశారు. సోమనాథ్ హత్య అనంతరం అతని భార్య భాగ్యశ్రీ తన భర్త మృతదేహం ముందు ప్రమాణం చేసింది. తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీసివేయనని ఆమె ప్రతిజ్ఞ చేసింది. సోమనాథ్ సోదరుడు ఈరన్న ముందు భాగ్యశ్రీ ఈ ప్రమాణం చేసింది.
READ MORE: DRI: పాకిస్థాన్కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!
సోమనాథ్ ను హత్య చేసిన నిందితులు సిద్ధారుధ, జగదీష్, అన్నప్ప ఇటీవల బెయిల్పై వచ్చారు. ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఈరన్న, నాగరాజు, భాగ్యశ్రీ ఎదురుచూస్తున్నారు.. జూన్ 24, మంగళవారం అర్ధరాత్రి సిద్ధారుధ, జగదీష్ ధాబాలో ఉన్నారని వీరికి సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. సిద్ధారుధ, జగదీష్లను చంపారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు డబుల్ మర్డర్ అనుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ రక్తపు మరకలను అనుసరించి వెనుక ఉన్న పొలంలోకి పరిగెత్తింది. ధాబాలో పనిచేసే రామచంద్ర అనే మరో వ్యక్తిని పొలంలో హత్య చేసినట్లు తెలిసింది. అప్పుడు ఇది ట్రిపుల్ మర్డర్ అని వెలుగులోకి వచ్చింది.
విచారకరమైన విషయం ఏమిటంటే హంతకుల లక్ష్యం రామచంద్ర కాదు అన్నప్ప. అయితే, చీకటిలో అన్నప్ప, రామచంద్ర హంతకుల నుంచి తప్పించుకుని పారిపోతున్నారు. హంతకులు వారిని వెంబడించారు. చీకటిలో హంతకులు రామచంద్రే అన్నప్ప అని భావించి చంపేశారు. ప్రస్తుతం, ఈ ట్రిపుల్ మర్డర్కు సంబంధించి పోలీసులు 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!