Karnataka: ట్రిపుల్ మర్డర్.. భర్తను హత్య చేసిన ముగ్గురిని ప్రతిజ్ఞ చేసి మరీ చంపిన భార్య..
- కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురి దారుణ హత్య
- తన భర్తను చంపిన వాళ్లను చంపిన భర్య
- మారణాయుధాలతో దాడి చేసిన నిందితులు
- ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
READ MORE: Air India plane crash: ఎయిరిండియా ప్రమాద బాధితుల కోసం రూ. 500 కోట్లతో టాటా ట్రస్ట్..!
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ఈ నేరానికి పాల్పడిన పట్టాన్ గ్రామ నివాసితులు నాగరాజ (23), ఇరన్న (27), భిర్ణ్య (21), సిద్ధినాద (22), నాగరాజ్ (17), పిరేష్ (35), సాగర్ (24), రచన్న్య అలియాస్ గిల్లి (22), చంద్రకాంత్ (30), భాగ్యశ్రీ (30) లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు హత్యకు గల కారణాలను వెల్లడించారు. వాస్తవానికి.. గత సంవత్సరం సోమనాథ్ తాలికోటి అనే యువకుడిని హత్య చేశారు. అప్పుడు సోమనాథ్ భార్య తన భర్త మృతదేహం ముందు హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు తన మంగళసూత్రాన్ని తీసివేయనని ప్రతిజ్ఞ చేసింది.
READ MORE: DRI: పాకిస్థాన్కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!
గత ఏడాది నవంబర్ 12న నిందితుల్లో ఒకరైన భాగ్యశ్రీ భర్త సోమనాథ్ తాలికోటి హత్యకు గురయ్యాడు. తాజాగా హత్యకు గురైన సిద్ధారుధ, అతని కుటుంబ సభ్యులు సోమనాథ్ను దారుణంగా హత్య చేశారు. సోమనాథ్ హత్య అనంతరం అతని భార్య భాగ్యశ్రీ తన భర్త మృతదేహం ముందు ప్రమాణం చేసింది. తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళసూత్రాన్ని తీసివేయనని ఆమె ప్రతిజ్ఞ చేసింది. సోమనాథ్ సోదరుడు ఈరన్న ముందు భాగ్యశ్రీ ఈ ప్రమాణం చేసింది.
READ MORE: DRI: పాకిస్థాన్కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!
సోమనాథ్ ను హత్య చేసిన నిందితులు సిద్ధారుధ, జగదీష్, అన్నప్ప ఇటీవల బెయిల్పై వచ్చారు. ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఈరన్న, నాగరాజు, భాగ్యశ్రీ ఎదురుచూస్తున్నారు.. జూన్ 24, మంగళవారం అర్ధరాత్రి సిద్ధారుధ, జగదీష్ ధాబాలో ఉన్నారని వీరికి సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. సిద్ధారుధ, జగదీష్లను చంపారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు డబుల్ మర్డర్ అనుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ రక్తపు మరకలను అనుసరించి వెనుక ఉన్న పొలంలోకి పరిగెత్తింది. ధాబాలో పనిచేసే రామచంద్ర అనే మరో వ్యక్తిని పొలంలో హత్య చేసినట్లు తెలిసింది. అప్పుడు ఇది ట్రిపుల్ మర్డర్ అని వెలుగులోకి వచ్చింది.
విచారకరమైన విషయం ఏమిటంటే హంతకుల లక్ష్యం రామచంద్ర కాదు అన్నప్ప. అయితే, చీకటిలో అన్నప్ప, రామచంద్ర హంతకుల నుంచి తప్పించుకుని పారిపోతున్నారు. హంతకులు వారిని వెంబడించారు. చీకటిలో హంతకులు రామచంద్రే అన్నప్ప అని భావించి చంపేశారు. ప్రస్తుతం, ఈ ట్రిపుల్ మర్డర్కు సంబంధించి పోలీసులు 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!