UP: యూపీలో దారుణం.. నలుగురు కుటుంబ సభ్యులు హత్య
- యూపీలో దారుణం
- నలుగురు కుటుంబ సభ్యులు హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని అమేథీలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఇంట్లో దుండగులు హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. సాయుధ దుండగులు ఇంట్లోకి చొరబడి ఉపాధ్యాయుడిని, అతని కుటుంబాన్ని కాల్చి చంపారు. అమేథీలోని శివరతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ క్రాస్రోడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడిని సునీల్ కుమార్(35)గా గుర్తించారు. అతను పన్హౌనాలోని కాంపోజిట్ స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Italy: తప్పిన విమాన ప్రమాదం.. మంటలు చెలరేగగానే కిందకు దిగేసిన ప్రయాణికులు
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
సునీల్ కుమార్ భార్య, 6 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల కొడుకుతో కలిసి గత మూడు నెలలుగా మున్నా అవస్థి నివాసంలో అద్దెకు ఉంటున్నారు. కుటుంబాన్ని వారి ఇంటిలోనే దారుణంగా కాల్చి చంపారు. ఈ దాడిలో ఉపాధ్యాయుడు, అతని భార్య, ఇద్దరు పిల్లలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సానుభూతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనాస్థలిని వెంటనే సందర్శించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇది దోపిడీ కేసుగా కనిపించడం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కక్షతోనే ఈ హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. పాఠశాలలో జరిగిన వ్యక్తిగత కక్షలతోనే ఈ మర్డర్ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు నలుగురిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు వచ్చేలోగా మరణించినట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Tips for kids: మీ పిల్లలు తినేటప్పుడు ఫోన్ చూస్తున్నారా?
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!