Tips for kids: మీ పిల్లలు తినేటప్పుడు ఫోన్ చూస్తున్నారా?
- మీ పిల్లలు తినేటప్పుడు ఫోన్ చూస్తున్నారా?
- ఇది చాలా ప్రమాదం
- దీన్ని తగ్గించేందుకు ఈ ప్రయత్నాలు చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్, ల్యాప్టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానికి బానిసలవుతున్నారు. పిల్లవాడు మొబైల్ చూడకుండా తిండి తినడు. మొబైల్ ని ముందు పెట్టుకుని తినే పిల్లలను మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు. వీటి వల్ల జరిగే అనర్థాలను ఇప్పుడు తెలుసుకుందా..
ఆహారం రుచి తెలియదు…
పిల్లలు మొబైల్ చూస్తూ తింటే.. అతను ఎంత తింటున్నాడో అతనికి తెలియదు. వారి ప్లేట్లో ఏ ఫుడ్ ఉందో కూడా చూడరు. అటువంటి పరిస్థితిలో, ఒకరు అవసరానికి మించి తింటారు, ఇది ఊబకాయం ముప్పును పెంచుతుంది. మొబైల్ చూస్తూ ఆహారం తినడం వల్ల, పిల్లలు ఆహారాన్ని రుచి చూడటం మరచిపోతారు. తిండి బాగుందో లేదో అతనికి అర్థం కాదు. పిల్లవాడు మొబైల్ చూస్తూ తింటాడు, ఎప్పుడు ఆహారం తిన్నాడో కూడా అతనికి గుర్తిండదు.
Also Read
- WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ఆహారం జీర్ణం అవ్వదు..
భోజనం చేస్తూ ఫోన్ చూడటం వల్ల జీవక్రియ రేటు తగ్గుతుంది. దీని వల్ల ఆహారం ఆలస్యంగా జీర్ణమవుతుంది, కొవ్వును కాల్చే ప్రక్రియ కూడా మందగిస్తుంది. మీ చిన్నారి ఫోన్ చూస్తూ తింటుంటే, ఫిజికల్గా యాక్టివ్గా లేకపోతే.. అతని జీవక్రియ మందగించే అవకాశం ఉంది. పిల్లలు స్మార్ట్ఫోన్కు ఎడిక్ట్ అయితే.. తల్లిదండ్రులతో అతని బాండింగ్పా ఎఫెక్ట్ పడుతుంది. పిల్లలు స్మార్ట్ ఫోన్ చూస్తూ తింటుంటే.. వాళ్లు అన్నం తినిపిస్తున్న అమ్మ వంక కూడా చూడడు. ఈ అలవాటు తల్లీ, బిడ్డ బంధంపై చెడు ప్రబావం చూపుతుంది. అంతేకాదు.. పిల్లల మెదడుకు కూడా హానికరం చేస్తుంది. పిల్లలు స్మార్ట్ఫోన్ చూస్తూ ఉంటే.. వారి కళ్లు కూడా బలహీనపడతాయి. మహమ్మారి తర్వాత పిల్లల్లో మయోపియా పెరగడానికి ఈ అలవాటు కూడా ఒక కారణం.
మొబైల్కి బదులు టీవీ ..
మొబైల్తో పోలిస్తే టీవీకి అడిక్షన్ తక్కువగానే కనిపిస్తోంది. ఇది మొబైల్ లేదా టాబ్లెట్ కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఇది కాకుండా.. మీరు సున్నితమైన ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు పిల్లలను దగ్గరకు తీసుకోండి. సలాడ్ తయారి వంటివి. తయారీలో వాళ్ల పాత్ర ఉండేలా చూడండి.. పిల్లలు తాము తయారుచేసిన వస్తువులను తినడానికి ఇష్టపడతారు. పిల్లలకు నచ్చిన రంగులు లేదా అక్షరాలతో స్పూన్లు, ప్లేట్లలో ఆహారాన్ని అందించండి.
ఒక వేళ ఇప్పటికే పిల్లలు అలవాటయి ఉంటే..
ఒక వేళ ఇప్పటికే పిల్లలు అలవాటయి ఉంటే.. పిల్లలకి కలరింగ్ పుస్తకాలు లేదా బొమ్మ కార్లు వంటి బొమ్మలను ఇవ్వండి. ఇవి స్క్రీన్ కంటే మెరుగైనవిగా పిల్లలు అనుకుంటారు. భోజనం చేసేటప్పుడు టీవీ చూడటానికి టైమర్ని సెట్ చేయండి. టైమర్ ఆఫ్ అయినప్పుడు, టీవీ ఆగి పోతుంది. మీరు తినే ప్రతిసారీ ఈ సమయాన్ని క్రమంగా తగ్గించండి. ఇది పిల్లలకి స్క్రీన్లు లేకుండా తినడంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
తాజావార్తలు
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!