Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి వందల కోట్ల రూపాయల మేర భారీ మోసానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ షేర్స్ బజార్ , కిసాన్ పరివార్ సంస్థలు నమ్మబలికాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందల మందితో పాటు దేశవ్యాప్తంగా వేలాది మందిని ఈ సంస్థలు బురిడీ కొట్టించాయి. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో ఫిర్యాదు చేయడంతో ఈ దందా గుట్టు రట్టయింది.
మహబూబాబాద్ జిల్లా కందికొండ గ్రామానికి చెందిన భూపాల్ అనే వ్యక్తి ఈ భారీ మోసానికి సూత్రధారిగా గుర్తించారు. అతను కొండాపూర్లో ‘షేర్స్ బజార్’ అనే సంస్థను ప్రారంభించి.. తమకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందని నకిలీ ప్రచారం చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించాడు. లక్ష రూపాయల పెట్టుబడి పెడితే నెలకు 4 శాతం చొప్పున ఖచ్చితమైన రాబడి ఇస్తామని నమ్మబలికాడు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏకంగా 150 మందికి పైగా ఉద్యోగులతో ఒక పెద్ద కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఫోన్ కాల్స్, ఆన్లైన్ ప్రచారాలు చేస్తూ పెద్ద ఎత్తున కస్టమర్లను వలలో వేసుకున్నాడు.
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్స్టా స్టోరీ!
- Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
- Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
సంస్థ మాటలు నమ్మిన బాధితులు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. కొందరైతే తమ పొలాలు, భూములు, బంగారం అమ్మి వచ్చిన డబ్బును కూడా ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. అయితే, 2025 అక్టోబర్ నుంచి పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన పేఔట్లను భూపాల్ అకస్మాత్తుగా నిలిపివేశాడు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తానూ ఎవరికీ డబ్బులు ఇవ్వనని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగాడు.
ఇప్పటికే గుజరాత్కు చెందిన కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు భూపాల్ దేశం విడిచి పారిపోకుండా గుజరాత్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది వరకు బాధితులు ఉండవచ్చని, మోసం విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
-
Ind Vs Ned: పసికూన నెదర్లాండ్పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
-
Annamalai: తమిళనాడు పాలిటిక్స్లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..
-
High-Protein Moong Dal Sandwich Recipe: ప్రోటీన్ పవర్తో పెసరపప్పు శాండ్విచ్.. రుచి, ఆరోగ్యం రెండూ ఒకే వంటకంలో
-
Samantha: హీరో మాత్రమే కాదు.. ఆయనొక రియల్ లీడర్!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!