Annamalai: తమిళనాడు పాలిటిక్స్లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెర లేవబోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తన పొలిటికల్ మాస్టర్ ప్లాన్ను రెడీ చేసినట్లు సమాచారం. తాను ఇటీవల
స్టార్ట్ చేసిన ‘వి ది లీడర్స్’ (We The Leaders) ప్రచారం సరైన దిశలో సాగుతోందని, వచ్చే జూలై నెలలోనే ఇది పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందబోతోందని ఆయన అధికారికంగా ప్రకటించారు. సాంప్రదాయ, వారసత్వ రాజకీయాలకు ఎండ్ కార్డ్ వేస్తూ సరికొత్త విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారని తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అన్నామలై సరికొత్త విప్లవం
వారసత్వ – శాశ్వత రాజకీయాలపై అన్నామలై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సొంత పార్టీ ఏర్పడిన తర్వాత నాయకుల పదవీకాలానికి స్పష్టమైన ‘పరిమితులు’ (Term Limits) విధించే ఆలోచనను పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజకీయాల్లో పాతవారి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవారికి అవకాశం లభించడం చాలా కీలకం. ఏ ఒక్కరికీ కుర్చీ శాశ్వతం కాకూడదు” అని స్పష్టంగా చెప్పారు. అమెరికా, లండన్ వంటి విదేశాలలో అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్న సమర్థులైన తమిళ వృత్తి నిపుణులు, సాంకేతిక నిపుణులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని, వారికి తమ పార్టీ ఒక పటిష్టమైన వేదికగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- CRPF: "భయపడొద్దు, నేను చూసుకుంటా".. జవాన్లకు CRPF చీఫ్ కీలక సందేశం..
- India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్పై కన్నడ సంఘాల ఆగ్రహం
- Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
50 లక్షల టార్గెట్..
ఒక సోషల్ మీడియా వేదికపై జరిగిన సంభాషణలో అన్నామలై తన భవిష్యత్తు కార్యాచరణను పంచుకున్నారు. తమ సంస్థలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ఈ ఉద్యమంలో 50 లక్షల మంది సభ్యులను చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోగా.. ఎలాంటి అంచనాలు లేకుండా ఇప్పటికే 18 లక్షల మంది ప్రచారంలో భాగస్వాములయ్యారని చెప్పారు. తమ కార్యకర్తలు కేవలం ఆన్లైన్లోనే కాకుండా, నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను సంప్రదిస్తూ సభ్యత్వ నమోదును ముమ్మరం చేస్తున్నారని వెల్లడించారు. తమిళనాడు ప్రజలు మార్పును బలంగా ఆశిస్తున్నారని, ఈ చొరవ రాష్ట్ర రాజకీయాలకు సరికొత్త దిశానిర్దేశం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
జూలై నుంచి రూపురేఖలు మారనున్నాయి..
తమ సంస్థ ప్రజలను ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుదోవ పట్టించదని, పూర్తి పారదర్శకతతో పనిచేస్తుందని అన్నామలై స్పష్టం చేశారు. తమ దృష్టిలో అన్ని మతాలు సంపూర్ణంగా సమానమేనని, ఎలాంటి వివక్షాపూరిత ఓటు బ్యాంక్ రాజకీయాలకు తమ సంస్థ పూర్తిగా దూరంగా ఉంటుందని తేల్చి చెప్పారు. తమిళనాడు యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ వ్యసన సమస్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి, నగరానికి ఈ సమస్యను తీసుకువెళ్తూ భారీ ప్రజా అవగాహన ఉద్యమాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న ‘వి ది లీడర్స్’, జూలై నెల నుంచి పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా మారిన తర్వాత తమిళనాడు రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మార్చబోతోందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
CRPF: “భయపడొద్దు, నేను చూసుకుంటా”.. జవాన్లకు CRPF చీఫ్ కీలక సందేశం..
-
OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు…ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
-
Bank Holidays August 2026: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టులో సగం రోజులు సెలవులే..!
-
Income Tax Return 2026: మరో రెండు రోజులే గడువు.. ఆలస్యమైతే రూ.5,000 వరకు జరిమానా.. ఇతర ఇబ్బందులు తప్పవు..!
-
India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!