Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
- ముస్సోరీ హోమ్స్టేలో 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి.
- హనీమూన్ ట్రిప్లో భర్తతో కలిసి వెళ్లిన సమయంలో ఘటన.
- గదిలో రక్తపు మరకలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం.
- ముక్కు నుంచి రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Mystery: యువజంట హనీమూన్ మిస్టరీగా మారింది. ఉత్తరాఖండ్ ముస్సోరీలో ఉన్న ఒక హోమ్ స్టేలో ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని మృతి చెందినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. మరణించిన మహిళను పి. రాధా గాయత్రిగా గుర్తించారు. ఈమె గురుగ్రామ్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఢిల్లీలోని కిద్వాయా నగర్ ఈస్ట్లో నివసిస్తోంది. ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్తో కలిసి కలిసి హనీమూన్ వెళ్లింది. భర్త పూణేలోని ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు.
జూన్ 14 రాత్రి వేళ ఇద్దరు టిప్రిధార్లో ఉన్న కియానా హోమ్ స్టేకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. భర్త చెప్పిన వివరాల ప్రకారం.. ఇద్దరు కూడా తెల్లవారుజామున 3.30 గంటల వరకు మద్యం సేవించి, నిద్రపోయినట్లు వెల్లడించాడు. ఉదయం నిద్ర లేచినప్పుడు, తన భార్య నగ్నంగా, స్పృహ లేకుండా నేలపై మూత్రంలో పడి ఉందని చెప్పాడు. ఆమె ముక్కు నుంచి రక్తం కారుతుందని చెప్పారు. ఘటన గురించి తెలిసిన పోలీసులు, మహిళను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అంబులెన్స్ లోని సిబ్బంది ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. బెడ్ షీట్పై రక్తం మరకలు, గదిలో రెండు మద్యం బాటిళ్లు, ఆహారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
- Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
- Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
- Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
మృతురాలు గాయత్రికి, శ్రీచరణ్లకు 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. ఇద్దరిది విశాఖపట్నం. ప్రస్తుతం పోస్టుమార్టం పరీక్ష కోసం మృతదేహాన్ని డెహ్రాడూన్లోని కరోనేషన్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి. వైద్యుల బృందం పోస్టుమార్టం చేయాలని, ప్రక్రియను కెమెరాలో రికార్డ్ చేయాలని పోలీసులు కోరారుు. పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
-
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
-
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
-
Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
-
Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల వివాదం.. కేంద్ర ప్రకటనలపై డిప్యూటీ సీఎం ఫైర్
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..