Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్స్టా స్టోరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ… ఒక దాచిన పెళ్లి… చివరకు ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్న దారుణ హత్య. సాధారణంగా సోషల్ మీడియా పోస్టులు ఆనందాన్ని పంచుతాయి. కానీ ఈసారి అదే సోషల్ మీడియా ఓ భయంకరమైన నేరాన్ని బయటపెట్టింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా జరిగిన పెళ్లి, మరో పెళ్లికి సిద్ధమైన యువతి, ఆ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త… చివరకు ఈ కథ విషాదాంతంగా ముగిసింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలి పేరు భవాని. ఆమె తులసీనగర్ ప్రాంతంలో నివసిస్తూ సమీపంలోని మొబైల్ దుకాణంలో ఉద్యోగం చేసేది. రోజూ ఆటోలో పనికి వెళ్లే భవానికి చంద్రశేఖర్ అనే ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. తరచూ ప్రయాణాల కారణంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత ఇద్దరూ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు.
Also Read
- Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
అయితే పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి నివసించలేదు. తమ తమ ఇళ్లలోనే ఉండేవారు. భవానికి ప్రేమ వ్యవహారం ఉందని మాత్రమే ఆమె తల్లిదండ్రులకు తెలుసు. కానీ చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకుందని వారికి తెలియదు. ఇదే సమయంలో కూతురికి మంచి సంబంధం చూడాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఒక యువకుడిని కూడా ఎంపిక చేశారు. కుటుంబ ఒత్తిడి పెరగడంతో భవాని ఆ పెళ్లికి అంగీకరించింది.
ఈ విషయం చంద్రశేఖర్ కు తెలియగానే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. మరో పెళ్లి చేసుకోవద్దని అతను పలుమార్లు భవానిని కోరాడు. తనను బెదిరిస్తున్నాడని భవాని కూడా తల్లిదండ్రులకు చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కానీ పరిస్థితి రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారింది.
జూన్ 13న చంద్రశేఖర్ నేరుగా భవాని ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు చూసిన సంబంధాన్ని తిరస్కరించాలని, పెళ్లి చేసుకోవద్దని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ భవాని అతని మాట వినలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన చంద్రశేఖర్ మరో పథకం వేశాడు. ఇద్దరం కలిసి విషం తాగి చనిపోదామని ఆమెకు చెప్పాడు. అయితే భవాని అందుకు అంగీకరించలేదు.
పోలీసుల వివరాల ప్రకారం, భవాని నిరాకరించడంతో చంద్రశేఖర్ బలవంతంగా ఆమెకు విషం తాగించాడు. అయినా అతని కోపం చల్లారలేదు. అనంతరం ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తాను కూడా కొద్దిపాటి విషం తాగాడు. తన దుస్తులపై కూడా కొంత విషం చల్లి ఇది ఆత్మహత్యలా కనిపించేలా నాటకం ఆడాడు. దీంతో కేసు అక్కడితో ముగిసిపోతుందని భావించాడు.
కానీ అతను చేసిన ఒక చిన్న పొరపాటు మొత్తం నేరాన్ని బయటపెట్టింది. ఆలయంలో జరిగిన తమ పెళ్లి ఫొటోలను చంద్రశేఖర్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఆ స్టోరీని భవాని మేనత్త చూసింది. ఫొటోలో ఉన్నది భవానేనని గుర్తించిన ఆమె వెంటనే ఈ విషయాన్ని భవాని తండ్రి శ్రీనివాస్ కు తెలియజేసింది.
అప్రమత్తమైన శ్రీనివాస్ వెంటనే కూతురిని సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం రావడంతో ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపులు లోపల నుంచి వేసి ఉండటంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా భవాని మృతదేహంగా కనిపించింది. అదే గదిలో చంద్రశేఖర్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ చివరకు నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. చంద్రశేఖర్ కు ఇదివరకే పెళ్లి అయిందని, అతనికి ఒక బిడ్డ కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రేమతో మొదలైన ఒక పరిచయం, రహస్య వివాహంగా మారి, చివరకు ప్రాణాలు తీసిన నేరంగా ముగియడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఒక సోషల్ మీడియా స్టోరీ బయటపెట్టిన ఈ హత్య కేసు ఇప్పుడు బెంగళూరులో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!