Robbery Gang Arrest : దొరికింది.. దొంగల ముఠా..!
- జ్యువెలరీ షాప్ దొంగతనంపై దుండిగల్ పోలీసుల దర్యాప్తు
- రాజస్థాన్ ముఠా అరెస్ట్.. 15 కిలోల వెండి స్వాధీనం
- తిరిగి పట్టుబడిన బెంగళూరులో అమ్మిన వెండి కూడా
- పరారీ నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery Gang Arrest : గత నెల 7వ తేదీన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్ లో ఓ జ్యువెలర్ షాప్ లో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుండి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బౌరంపేటలోని సోమేశ్వర్ జ్యువెలరీ షాపు పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ ను అద్దెకు తీసుకొని రాత్రి పక్క దుకాణంలోకి రంధ్రం చేసి దుకాణం నుండి దాదాపు 15 కిలోల వెండిని దొంగిలించారు..
ఉదయం షాపుకు వచ్చి చూసిన యజమాని షాపు గోడ పగలకొట్టి ఉండటం.. షాపులో ఉన్న దాదాపు 18 కిలోల వెండి కనిపించకుండా పోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించి బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీబీ విజ్యువల్స్ ఆధారంగా నిందితులు రాజస్థాన్ కు చెందిన చేతన్ ప్రకాష్ రియా, సిరాజుద్దీన్ ,కాలుకాగా కాలురాం లు గా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.. పోలీసుల విచారణలో 6 నిందితులు దొంగతనంలో పాల్గొన్నట్లుగా గుర్తించి బెంగళూర్ లో విక్రయించిన 3.5 కేజీల వెండి ఆభరణాలతో పాటు మొత్తం 15 కిలోల వెండి వస్తువులు, బొల్లెరో వాహనం, దాదాపు 4 అడుగుల ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
పరారీ లో ఉన్న మరో ముగ్గురు అల్ నాథూరాం, మహేందర్, జై తరుణ్ గోవింద్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు డీసీపీ పురుషోత్తం తెలిపారు.. అద్దెదారునికి అద్దె ఇచ్చే ముందు, భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకుండా ఉండటానికి ముందుగా అద్దెదారు నుండి పత్రాలను సేకరించి, అతని స్వస్థలం ధృవీకరించుకోవాలని అడిషనల్ DCP అన్నారు.
CM Revanth Reddy : వారికి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!