Robbery Gang Arrest : దొరికింది.. దొంగల ముఠా..!
- జ్యువెలరీ షాప్ దొంగతనంపై దుండిగల్ పోలీసుల దర్యాప్తు
- రాజస్థాన్ ముఠా అరెస్ట్.. 15 కిలోల వెండి స్వాధీనం
- తిరిగి పట్టుబడిన బెంగళూరులో అమ్మిన వెండి కూడా
- పరారీ నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery Gang Arrest : గత నెల 7వ తేదీన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్ లో ఓ జ్యువెలర్ షాప్ లో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుండి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బౌరంపేటలోని సోమేశ్వర్ జ్యువెలరీ షాపు పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ ను అద్దెకు తీసుకొని రాత్రి పక్క దుకాణంలోకి రంధ్రం చేసి దుకాణం నుండి దాదాపు 15 కిలోల వెండిని దొంగిలించారు..
ఉదయం షాపుకు వచ్చి చూసిన యజమాని షాపు గోడ పగలకొట్టి ఉండటం.. షాపులో ఉన్న దాదాపు 18 కిలోల వెండి కనిపించకుండా పోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించి బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీబీ విజ్యువల్స్ ఆధారంగా నిందితులు రాజస్థాన్ కు చెందిన చేతన్ ప్రకాష్ రియా, సిరాజుద్దీన్ ,కాలుకాగా కాలురాం లు గా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.. పోలీసుల విచారణలో 6 నిందితులు దొంగతనంలో పాల్గొన్నట్లుగా గుర్తించి బెంగళూర్ లో విక్రయించిన 3.5 కేజీల వెండి ఆభరణాలతో పాటు మొత్తం 15 కిలోల వెండి వస్తువులు, బొల్లెరో వాహనం, దాదాపు 4 అడుగుల ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు..
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
పరారీ లో ఉన్న మరో ముగ్గురు అల్ నాథూరాం, మహేందర్, జై తరుణ్ గోవింద్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు డీసీపీ పురుషోత్తం తెలిపారు.. అద్దెదారునికి అద్దె ఇచ్చే ముందు, భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకుండా ఉండటానికి ముందుగా అద్దెదారు నుండి పత్రాలను సేకరించి, అతని స్వస్థలం ధృవీకరించుకోవాలని అడిషనల్ DCP అన్నారు.
CM Revanth Reddy : వారికి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!