ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. నేపాల్ కి చెందిన బాలిక జూబ్లీహిల్స్ లో తల్లితండ్రితో కలిసి నివాసం ఉంటోంది. బాలిక కి తన ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు కృష్ణ తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో బాలిక ను ట్రాప్ చేశాడు కృష్ణ.. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో ఇంట్లో నుంచి బాలిక వచ్చేసింది. Also Read:Gold Price Today:…
తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ఏం చేస్తుంటారో వారికే అర్థం కాదు. వ్యామోహాన్నే ప్రేమ అనుకుని దారి తప్పుతుంటారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక అమ్మాయి కోసం 100 కి.మీ ప్రయాణం చేశాడు.
కరీంనగర్ జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం కలకలం రేపింది. అలుగునూర్ కాకతీయ కాలువ పరిసరాల్లో ఓ బాలికపై అత్యాచారయత్నానానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. కరీంనగర్ రూరల్ మండలం చింతకుంట సమీపంలోని వడ్డేపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక కరీంనగర్లోని ప్రైవేట్ ఒకేషనల్ కళాశాలలో ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి కళాశాలలో దింపుతానని అమ్మాయిని బైక్ పై ఎక్కించుకొని హైదరాబాద్ రోడ్డు గుండా ఎల్ఎండి పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్లాడు. Also…
తమిళనాడులో పెను విషాద ఘటన చోటుచేసుకుంది.. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల బాలిక రోషిణిని చిరుతపులి లాక్కెళ్లి దాడి చేసింది... కోయంబత్తూర్ సమీపంలోని వాల్పరైలోని టీ ఎస్టేట్లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్లో పనిచేస్తుండగా బాలికపై చిరుత దాడి చేసింది. గంటల తరబడి గాలింపు చర్యలు తరువాత అటవీ ప్రాంతంలో బాలిక శరీర భాగాలను గుర్తించారు పోలీసులు.. అప్పటికే చిరుత పులి బాలికను సగం తిన్నట్లుగా పోలీసులు వెల్లడించారు..
చనిపోయిన అమ్మానాన్నలను AI ద్వారా ఫంక్షన్ లో స్క్రీన్ పై వీడియో చూసి ఓ బాలిక కన్నీరు మున్నిరైంది. కరీంనగర్ మారుతినగర్ కు చెందిన నిమ్మల చందు – సుమలత దంపతులు అనారోగ్యం కారణంగా 6 సంవత్సరాల క్రితం కన్నుమూశారు. అప్పటికే వారికి ఒక కుమారుడు, కుమార్తె కు ఉన్నారు. వారి అమ్మ నాన్నలు చనిపోయిన సమయంలో ఇద్దరు పిల్లలు చాలా చిన్నవారు. వారి అమ్మానాన్న ఎలా ఉంటారో కూడా తెలియని వయసులో ఆ చిన్నారులు వారి…
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అసభ్యకర మెసేజ్ లు బాలిక ప్రాణాలు తీశాయి. రంగనాయకుల గుట్టకు చెందిన బాలిక మీనాక్షి ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల విద్యార్ది రోహిత్ తన తమ్ముడి సోషల్ మీడియా అకౌంట్ నుంచి బాలికకు అసభ్యకర మెసేజ్ లు పంపించాడు. బాలికను వేధించసాగాడు. పోకిరి చేష్టలకు భయపడిపోయిన బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన వారు రెండు రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు…
ఓ చిన్నారి మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయిన తల్లి చదివిస్తుందని కంటతడి పెట్టుకుంది. ఇక, ఆ చిన్నారి మాటలకి తల్లడిల్లిన ఆయన ఆ పాపను దగ్గరికి పిలిచి ఓదార్చాడు. సదరు చిన్నారితో పాటు హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు.
బెజవాడలో దారుణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తెకు ఓ ప్రబుద్ధుడు వాతలు పెట్టాడు. అక్రమ సంబంధానికి పాప అడ్డం వస్తుందని వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టిన శ్రీ రాములు అనే వ్యక్తి. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ వైఎస్సార్ కాలనీ కి చెందిన గృహిణి కలరా హాస్పిటల్ వద్ద నివసించే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె మొదటి భర్త ఆటో డ్రైవర్. కాగా ఏవో కారణాలతో విడిపోయి…
ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన మరో సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది.. గన్నవరంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులోని మిస్టరీని ఛేదించారు ఆత్కూరు పోలీసులు.. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది..
ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాక పనులన్నీ ఈజీ అయిపోయాయి. వాషింగ్ మెషిన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఏసీలు, గీజర్లు విరివిగా వినియోగిస్తున్నారు. అయితే వీటి వాడకం ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరికరాలను ఉపయోగించే సమయంలో చిన్న పొరపాటు వల్ల విద్యుత్ అఘాతాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వాషింగ్ మెషిన్ ఆపరేటింగ్ చేస్తూ ఓ బాలిక విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన…