Honour KIilling: యూపీలో పరువు హత్య.. సోదరి, ఆమె ముస్లిం ప్రియుడి హత్య..
- ఉత్తర్ప్రదేశ్లో హిందూ యువతి, ముస్లిం యువకుడి హత్య..
- ప్రేమ వ్యవహారంతో హత్య చేసిన యువతి సోదరులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour KIilling: ఉత్తర్ప్రదేశ్ మొరాదాబాద్లో పరువు హత్య సంచలనంగా మారింది. ముస్లిం యువకుడు, హిందూ యువతి ప్రేమించుకోవడంతో, ఇద్దరి మతాలు వేరు కావడంతో సోదరి అన్నయ్యలే ఇద్దరిని హత్య చేసినట్లు తేలింది. వీరిద్దరి మృతదేహాలు సమీపంలోని ఒక అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. యువతిని 19 ఏళ్ల కాజల్, యువకుడిని 27 ఏళ్ల అర్మాన్గా గుర్తించారు. వీరిద్దరిది మొరాదాబాద్లోని ఉమ్రీ సబ్జీపూర్ గ్రామం.
Read Also: Love Marriage: గుడిలో పెళ్లి.. ప్రేమ జంటపై యువతి కుటుంబ సభ్యుల దాడి..
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
పోలీసుల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం అర్మాన్, కాజల్ అదృశ్యమయ్యారు. అర్మాన్ కనిపించడం లేదని హనీఫ్ తండ్రి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో కాజల్ కూడా కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. కాజల్ ముగ్గురు సోదరులను విచారించగా, ఇద్దరిని చంపినట్లు ఒప్పుకున్నారు. వీరిద్దరిని పూడ్చిపెట్టిన ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. నిన్న సాయంత్రం మృతదేహాలను వెలికితీశారు. అర్మాన్, కాజల్ చేతులు, కాళ్లు కట్టేసి ఆ తర్వాత వీరిద్దరిని చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
కాజల్ ముగ్గురు సోదరులపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరం మతపరమైన గొడవకు దారితీయకూడదని పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. ఈ ఘటనపై అర్మాన్ సోదరి మాట్లాడుతూ.. అర్మాన్, కాజల్ మధ్య రిలేషన్ ఉందని తమకు తెలియదని చెప్పింది. అర్మాన్ నాలుగేళ్లు సౌదీ అరేబియాలో పనిచేశాడు. మూడు నెలల క్రితం సొంత ఊరికి వచ్చాని ఆమె పేర్కొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?