Robbery: సినీఫక్కీలో భారీ చోరీ.. తుపాకీ తలపై గురిపెట్టి.. ఎంత ఎత్తుకెళ్లారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery: ముఖానికి ముసుగు ధరించి, బ్యాగులో నుంచి తుపాకీ తీసి తాళాలు అడిగి, తలపై తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించి దొంగతనాలకు పాల్పడడం సాధారణంగా సినిమాలో చూస్తుంటాం. అలా సినీఫక్కీలోనే ఓ భారీ చోరీ జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఈ చోరీ కలకలం రేపుతోంది. చోరీ జరిగి 24 గంటలు గడిచినా నేరగాళ్ల ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. పక్కా పథకం ప్రకారం సుమారు రూ.12 కోట్ల విలువైన 23కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దుండగులు దోచుకెళ్లారు. ఉదయ్పూర్లోని ప్రతాప్ నగర్లోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయాన్ని సోమవారం ఉదయం ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.
ఉదయపూర్లోని ప్రతాప్ నగర్లోని వాణిజ్య భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంలోకి ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో సెక్యూరిటీ లేని గేటు నుంచి ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు లోపలకి చొరబడ్డారు. దుండగులు వచ్చినప్పుడు మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులు, ఓ ఖాతాదారుడు ఉన్నారు. ఒక్కో దుండగుడు ఒక్కో ప్రదేశానికి వెళ్లి వారి బ్యాగుల్లో తుపాకీలు తీసి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరించారు. మేనేజర్ క్యాబిన్తో పాటు, బంగారం, నగదు భద్రపరిచే గదిలోకి దొంగలు ప్రవేశించారు. కార్యాలయంలోని ప్రధాన గదిలో ఉన్న వారందరినీ ఒక మూలకు వెళ్లాలని తుపాకీ గురిపెట్టి బెదిరించారు. వెళ్లకపోతే ఉద్యోగులు, వినియోగదారులను కాల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వారి మొబైల్ ఫోన్లు తీసుకుని ల్యాండ్లైన్ను డిస్కనెక్ట్ చేశారు. వీరందరికి ఓ దుండగుడు కాపాల ఉండగా.. మిగిలిన వారంతా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లి అక్కడ భద్రపర్చిన తాకట్టుకు వచ్చిన బంగారు నగలను బ్యాగుల్లో సర్దుకున్నారు. సుమారు 23 కిలోల బంగారాన్ని ఆ దుండగులు ఎత్తికెళ్లారు. మణప్పురం సిబ్బంది దుండగులతో వాగ్వాదం పెట్టుకోగా.. పలుమార్లు సిబ్బందిని దుండగులు కొట్టినట్లు పోలీసులకు కార్యాలయం మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు దొంగలు బ్యాంకు అధికారులను తుపాకీతో కొట్టడం బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలో బంధించిన ఘటనకు సంబంధించిన వీడియోలో ఉందని పోలీసులు తెలిపారు.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
Sara Ali Khan and Shubman Gill: యంగ్ క్రికెటర్తో సారా అలీఖాన్ డేటింగ్..! ఇదిగో సాక్ష్యం
కార్యాలయం నుంచి దుండగులు బయటకు వెళ్లేటప్పుడు మణప్పురం కార్యాలయ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ చేతులు కట్టేసి, మిగిలినవారు బయటకు రాకుండా ఆఫీసు ప్రధాన ద్వారానికి తాళం వేసి పరారయ్యారు. దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చినట్లు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. పది నిమిషాల వ్యవధిలో ఈచోరీ మొత్తం పూర్తయింది. అనంతరం బ్యాంకు అధికారులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను పట్టుకునేందుకు నగర సరిహద్దుల్లో బారికేడింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎట్టకేలకు ఆ నిందితులను పట్టుకుని తీరుతామని పోలీసులు తెలిపారు. ఈ చోరీలో సంస్థ సిబ్బంది ప్రమేయంపై కూడా విచారణ చేపడతామని వెల్లడించారు. ఆ కార్యాలయానికి సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!