Crime: తాత మరణంపై ఫేస్బుక్ పోస్ట్.. హత్యకు దారితీసిన ‘‘లాఫింగ్ ఎమోజీ’’..
- తాత మరణంపై ఫేస్బుక్ పోస్టు..
- హత్యకు దారి తీసిన ‘‘లాఫింగ్ ఎమోజీ’’
Crime: ‘‘లాఫింగ్ ఎమోజీ’’ ఒకరి హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాజ్కోట్లోని ఒక ఫ్యాక్టరీలో బీహార్కు చెందిన 20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ అతని ముగ్గురు బంధువులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితంత తన తాత రూప్నారాయణ్ భింద్ మరణించారు. ఆయనను గుర్తు చేసుకుంటూ, ప్రిన్స్ ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. అయితే, ప్రిన్స్కు పరిచయస్తుడైన బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ ఈ పోస్టుకు ‘‘నవ్వుతున్న ఎమోజీ’’ని పెట్టాడు. దీంతో ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది.
Read Also: GST 2.0 Complaint Process: ప్రజలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే.. ఈ పని చేయండి
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఫోన్లో మొదలైన వాగ్వాదం, భౌతిక ఘర్షణగా మారింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, సెప్టెంబర్ 12 రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రిన్స్ తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ నుంచి ఆటో రిక్షాలో ఇంటికి వెళ్తున్న సమయంలో బిపిన్ అడ్డగించాడు. ప్రిన్స్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు, అయితే మరో నిందితుడు బ్రిజేష్ గోండ్ అతడిని అడ్డుకుని చంపేస్తామని బెదిరించారు. ఇంతలో బిపిన్ ప్రిన్స్ను కత్తిలో పొడిచాడు.
ప్రిన్స్ అరుపులు విన్న వెంటనే అతడి సహచరులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రిన్స్ వీపుపై తీవ్రమైన గాయమైంది. ఆస్పత్రిలో పోలీసులకు తన వాంగ్మూలాన్ని అందించాడు. నాలుగు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఈ కేసులో నిందితులు ఇద్దరిపై హత్యా నేరం మోపబడింది. ప్రధాన నిందితుడు బిపిన్ ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. మరో నిందితుడు బ్రిజేష్ పరారీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!