Horrific Incident: కుషాయిగూడలో పోకిరీల ఉన్మాదం.. కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి.. ప్రైవేట్ పార్ట్స్…!
- బొలెరోతో ఢీకొట్టి కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లిన దుండగులు
- ప్రశ్నించినందుకే ప్రాణాలతో ఆట
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో బాధితుడు
- నిందితుల వివరాలు వెల్లడి చేయాలని కుటుంబం డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సైరన్లు వేసుకుంటూ రోడ్లపై హంగామా సృష్టించడమే కాకుండా, ప్రశ్నించిన వారిని ప్రాణాలతోనే ఈడ్చుకెళ్లే స్థాయికి వీరి ఉన్మాదం చేరింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక సామాన్య ప్రైవేట్ ఉద్యోగిని బొలెరో కారుతో ఢీకొట్టి, కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి, అతని ప్రాణాలను గాలిలో కలిపే ప్రయత్నం చేశారు కొందరు యువకులు.
బాధిత కుటుంబ సభ్యులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. విధి నిర్వహణ ముగించుకుని రాత్రి సమయంలో తన కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఇదే క్రమంలో ఒక బొలెరో కారులో ఉన్న కొందరు యువకులు కారుకు సైరన్ వేసుకుంటూ, అతివేగంతో రోడ్డుపై హంగామా సృష్టించారు. సతీష్ కారును బొలెరోతో బలంగా ఢీకొట్టిన ఆ యువకులు, కనీసం ఆపకుండా వేగంగా వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.
Also Read
- Rajasthan Crime: తాత హత్యకు దారితీసిన పెళ్లి వివాదం
- West Bengal: కాంగ్రెస్ నేత, కుమారుడి కాల్చివేత.. ఇంటికి వెళ్తున్న సమయంలో దారుణం..
- BSF Jawan: ‘ఆమె పైకప్పు నుంచి పడిపోయింది’.. భార్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు BSF జవాన్ ప్రయత్నం?
- Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
Ryzen 5 + 16GB RAM + SSD.. ఇప్పుడు 46,699 కే.! డీల్ మిస్ అవ్వకండి.!
దీంతో సతీష్ వారిని వెంబడించి కొంత దూరం వెళ్ళాక ఆపగలిగాడు. కారు దిగి దుండగుల బొలెరోకు ఎదురుగా నిల్చుని, ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏమాత్రం కనికరం లేని ఆ యువకులు కారును సతీష్ వైపు వేగంగా పోనిచ్చారు. కారు వేగంగా రావడంతో సతీష్ కిందపడిపోయి, ప్రాణ రక్షణ కోసం బొలెరో ముందున్న బంపర్ను గట్టిగా పట్టుకున్నాడు. కారు కింద మనిషి ఉన్నాడని తెలిసినా, ఆ పోకిరీలు కనికరించలేదు. సుమారు 700 మీటర్ల నుండి ఒక కిలోమీటరు వరకు అలాగే ఈడ్చుకెళ్లారు. ఆ భయంకరమైన రాపిడికి సతీష్ వీపు భాగం అంతా రోడ్డుకు గీసుకుపోయి తీవ్రంగా దెబ్బతింది. నొప్పి భరించలేక సతీష్ బంపర్ వదిలేయగా, ఆ కారు అతనిపై నుంచే దూసుకెళ్లిపోయింది.
కారు కింద పడి ఈడ్చుకెళ్లడం వల్ల సతీష్ ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. కాలు విరగడంతో పాటు వీపు భాగం మొత్తం చెక్కుకుపోయింది. ప్రస్తుతం సతీష్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన జరిగి ఇంత దారుణం జరిగినా పోలీసులు నిందితుల వివరాలను వెల్లడించకపోవడంపై సతీష్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరుల కారుకు పోలీసుల లాంటి సైరన్ ఎలా ఉంది? ఆ కారులో ఉన్న యువకులు ఎవరు? వారు మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నారా? నిందితుల వెనుక ఎవరైనా రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఉన్నారా? అందుకే పోలీసులు వివరాలు దాస్తున్నారా? అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది.
CM Chandrababu: మారకపోతే వాళ్లకే నష్టం.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్..
తాజావార్తలు
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
-
CM Revanth Reddy : సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్ను కూడా తీసుకురండి
-
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
-
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?