Hyderabad Cyber Fraud: మామూలు కి’లేడి’ కాదయ్యో.. ఇల్లు గుల్ల చేసిందిగా!
- డాక్టర్ను మాయ చేసి రూ.14 కోట్లు స్వాహా చేసింది
- ఇల్లు అమ్మి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన డాక్టర్
- ప్లేటు తిప్పేసిన సైబర్ ముఠా
Hyderabad Cyber Fraud: మాయ మాటలు చెప్పి ఓ కిలేడి డాక్టర్ను మాయ చేసి, ఏకంగా ఆయన సొంత ఇంటిని అమ్మించి రూ.14 కోట్లు కొల్లగొట్టింది. ఈ సంఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. హైదరాబాద్కు చెందిన ఒక డాక్టర్ నుంచి ఈ కిలేడి ఏకంగా రూ.14 కోట్లు కొట్టేసింది. ఈ కిలేడి ముఠా తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్ను బురిడీ కొట్టించి, రూ.14 కోట్లు స్వాహా చేశారు.
Also Read
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
ముందుగా సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయి ఫోటోలతో డాక్టర్ని బుట్టలో వేసుకున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన కిలేడి ఆ డాక్టర్కు మెసేజ్ పెట్టి ట్రాప్ చేయడం స్టార్ట్ చేసింది. డాక్టర్ అందమైన అమ్మాయి ఫోటోల చూసి చాటింగ్ మొదలుపెట్టాడు. ఇదే అదనుగా ఈ కిలేడి చెలరేగి పోయింది.. తాను ఒక ఒంటరి మహిళని, స్టాక్ మార్కెట్కు సంబంధించిన కంపెనీలో పని చేస్తానని డాక్టర్కు పరిచయం చేసుకుంది.
ఈ క్రమంలో డాక్టర్కు స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ ద్వారా పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. అందమైన అమ్మాయి చెబుతుందని అనుకున్నాడో, లేదంటే లాభాలకు అత్యాశకు పోయాడో కానీ ఆ డాక్టర్ ఈ కిలేడీని నమ్ముకుని సొంత ఇల్లును అమ్మి రూ.14 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ డాక్టర్ పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ కిలేడి ముఠా ప్లేటు ఫిరాయించింది. దీంతో మోసపోయానని గుర్తించిన డాక్టర్ సైబర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అధికారులు డాక్టర్ కేసులో నలుగురిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ.. మోసపోయిన డాక్టర్ను సైబర్ కేటుగాళ్లు కంబోడియా నుంచి ట్రాప్ చేసి మోసం చేసినట్లు తెలిపారు. కంబోడియాలో తిష్ట వేసిన చైనా దేశస్థులు ఈ వ్యవహారం వెనకాల ఉన్నారని చెప్పారు. ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని వెల్లడించారు. చైనీయులు మన దేశం వాళ్లతోనే ఇక్కడ సైబర్ నేరాలు చేయిస్తున్నారని తెలిపారు. ఈ కేసు విచారణలో కంబోడియాలో ఉన్న సైబర్ నేరగాలకు mule అకౌంట్స్ అందించిన నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు mule అకౌంట్లోకి వచ్చిన డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా కాంబోడియాకి తరలించినట్లు గుర్తించినట్లు తెలిపారు.
READ ALSO: Sandeep Reddy Vanga: ‘ధురంధర్’పై సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రివ్యూ!
తాజావార్తలు
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
ట్రెండింగ్
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!