5G offers: ఎయిర్టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు
5G 0ffers: దేశీయ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఉచిత 5జీ సేవలను అందించడంపై మరో టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎయిర్టెల్, జియోలపై ఫిర్యాదు చేస్తూ వోడాఫోన్ ఐడియా టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి లేఖ రాసింది. దీంతో ఎయిర్టెల్, జియోలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఇరు సంస్థలు తమ వాదనలు వినిపించాయి. తాము అందించే 5G సేవలు ఉచితం కాదని Jio మరియు Airtel పేర్కొన్నాయి. కొన్ని ఎంపిక చేసిన 4G ప్లాన్లను సబ్స్క్రయిబ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే వాటిని అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో 5జీ సేవలను ప్రవేశపెట్టిన సందర్భంగా ‘ఎయిర్టెల్ 5జీ ప్లస్’ నెట్వర్క్ ద్వారా వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ₹ 239 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే 5G ఫోన్ని ఉపయోగించే పోస్ట్పెయిడ్ మరియు ప్రీపెయిడ్ వినియోగదారులు 5G సేవలను పొందవచ్చని Airtel ప్రకటించింది. అయితే వినియోగదారులు ఆశించిన స్థాయిలో 5జీ సేవలను వినియోగించుకోవడం లేదని రెండు సంస్థలు తెలిపాయని ట్రాయ్ వెల్లడించింది. వోడాఫోన్ ఐడియా ఫిర్యాదుపై మేము జియో మరియు ఎయిర్టెల్లకు నోటీసులు జారీ చేసాము. రెండు సంస్థలు తమ వాదనలు వినిపించాయి. ట్రాయ్లోని న్యాయ, ఆర్థిక, సాంకేతిక విభాగాల ప్రతినిధులు వీటిపై చర్చిస్తున్నారు. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం’’ అని ట్రాయ్ పేర్కొంది.
Read also: Fake notes: నకిలీ నోట్లొస్తున్నాయి.. జాగ్రత్త
Also Read
- Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
- Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
- Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
టెలికాం ఆపరేటర్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా జియో యొక్క తక్కువ-ధర టెలికాం సేవలపై TRAIకి ఫిర్యాదు చేశాయి. జియో టీవీలో ఐపీఎల్ ప్రసారాలపై ఎయిర్టెల్ కొద్ది రోజుల క్రితం ట్రాయ్కి ఫిర్యాదు చేసింది. దీనిపై జియో ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగానే ఎయిర్టెల్ ఈ ఫిర్యాదు చేసిందని TRAIకి రాసిన లేఖలో జియో పేర్కొంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలు మరియు పట్టణాల్లో Airtel మరియు Jio 5G సేవలను అందజేస్తుండగా, Vodafone Idea కొన్ని ప్రాంతాలలో ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ సేవలను అందిస్తోంది.
DGP Anjani Kumar: సైబర్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.. దేశంలోనే తెలంగాణ ఫస్ట్
తాజావార్తలు
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
-
AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
-
Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!
-
Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్లకే ఎలా సాధ్యం?
-
Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!