Fake notes: నకిలీ నోట్లొస్తున్నాయి.. జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake notes: నకిలీ నోట్లను చలామణి చేస్తూ కొన్ని ముఠాలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. సైబరాబాద్ పోలీసులు రెండు నెలలుగా సాగుతున్న విచారణలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రధాన నిందితులు నకిలీ నోట్లను చలామణి చేసేందుకు ఏజెంట్లను నియమించుకుని వాటి ద్వారా వాటిని మార్కెట్ చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనధికారికంగా రెండు నుంచి మూడు కోట్ల వరకు నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నిందితులు తమ ఏజెంట్లకు నకిలీ నోట్లను అందజేస్తున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు ఇప్పుడు నకిలీ నోట్ల వ్యవహారంపై దృష్టి సారించారు.
చిరువ్యాపారులను టార్గెట్ చేస్తూ నకిలీ నోట్లు ఎక్కువగా చెలామణి అవుతున్నందున వారికి నకిలీ నోట్లపై అవగాహన కల్పించనున్నారు. నకిలీ నోట్లను తయారు చేయడంతో పాటు నకిలీ నోట్లను మార్కెట్ చేయడానికి నేరస్థులు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో ఇలాంటి వారి పట్ల సామాన్యులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సమాచారం గుర్తిస్తే పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. నోట్ల భద్రత కోసం ఆర్బీఐ 17 అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంది. సామాన్య పౌరులకు ఈ విషయాలన్నీ తెలుసుకునే అవకాశం లేదు. కనీసం కొన్నింటిని జాగ్రత్తగా పరిశీలించాలి. నోట్ నాణ్యత, నోట్ నలుమూలలా సరిగ్గా ఉండాలి. నోట్పై ఉన్న గీతలు చేతికి తాకాలి. 500 అని నోట్పై పువ్వులో రాయాలి. ఒక్క సెక్యూరిటీ థ్రెడ్ మాత్రమే ఉంది. గాంధీ విగ్రహం పక్కన 500 అని రాసి ఉంటుందని గమనించాలని సూచించారు.
Also Read
Read also: DGP Anjani Kumar: సైబర్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.. దేశంలోనే తెలంగాణ ఫస్ట్
కాగా.. సైబరాబాద్ పరిధిలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ముఠాకు సరఫరా అవుతున్న నకిలీ నోట్లు బాండ్ పేపర్తో తయారు చేసిన నకిలీ నోట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా అవసరాన్ని బట్టి నకిలీ నోట్లను తయారు చేసి, ముందుగా తయారు చేసినవి మార్కెట్కు వెళ్లిన తర్వాత కొత్త నోట్లను ముద్రిస్తున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాలను అవకాశంగా తీసుకుంటున్నారు. నకిలీ నోట్లను గుర్తించేంత నైపుణ్యం లేని ప్రాంతాలను గుర్తించి అక్కడ చెలామణి చేస్తున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. అసలైన నోట్లను పోలిన నకిలీ నోట్లను తయారు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. చిన్న కిరాణా దుకాణాలు, వీక్లీ మార్కెట్లు, పాన్ షాపులు, గ్రామాల్లోని మద్యం దుకాణాలు, పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు, మనీ ట్రాన్స్ఫర్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు, పాల దుకాణాలు, ఈవెంట్లు, కాలేజీ ఫెస్ట్లు, స్క్రాప్ షాపులు, పుష్కరాలు, లేబర్ స్టాల్స్ లక్ష్యంగా ఈ నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయని చిరు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి వారు ఎవరైనా మీ పరిధిలోకి వస్తే వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వాలని కోరారు.
TSRTC Offer: భారీగా తగ్గిన ఆర్టీసీ బస్సు చార్జీలు.. ప్రయాణికులకు పండగే
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!